Kandula Durgesh: సినిమా టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కీలక ప్రకటన

Read Time:  1 min
Kandula Durgesh: సినిమా టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కీలక ప్రకటన
FONT SIZE
GET APP

ఈరోజు ప్రభుత్వ ఉన్నతాధికారులు, (Kandula Durgesh) సినీ ప్రముఖులతో ఆంధ్రప్రదేశ్,(AP) సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, సినిమా విడుదల అయ్యేటప్పుడు అప్పటికప్పుడు టికెట్ ధరలు పెంచుకోకుండా, ఒక సమగ్ర విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు.ఇటు సినీ పరిశ్రమకు, అటు ప్రేక్షకులకు న్యాయం జరిగేలా టికెట్ రేట్లు ఉండేలా చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు.

Read also: Consumer Laws : వినియోగదారుల చట్టాల పట్ల అవగాహన అనివార్యం!

 Kandula Durgesh: సినిమా టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కీలక ప్రకటన

సినిమా టికెట్ల ధరలపై నియంత్రణకు చర్యలు

సినిమా విడుదలైన ప్రతిసారి రేట్లు పెంచడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని దుర్గేశ్ తెలిపారు. (Kandula Durgesh) ప్రతిసారి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి ఒకే జీవో ఉండేలా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆర్టిస్టుల రెమ్యునరేషన్ పై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.