📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu news: K. Vijayanand: ధాన్యం కొనుగోలులో జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్

Author Icon By Tejaswini Y
Updated: December 5, 2025 • 10:52 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

AP: రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ముమ్మరంగా సాగుతుందని ధాన్యం కొనుగోలు లో రైతులకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె. విజయానంద్(K. Vijayanand) అధికారులను ఆదేశించారు. అమరావతిలోని సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా ధాన్యం కొనుగోలు గణాంకాలను జిల్లాల వారీగా అడిగి తెలుసుకుని పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులకు సరిపడినన్ని గోనెసంచులు అందుబాటులో ఉంచాలన్నారు.

Read Also: Google Data Center : గూగుల్ డేటా సెంటర్ కు 480 ఎకరాలు కేటాయించిన ఏపీ సర్కార్

K. Vijayanand Video conference with district collectors on grain procurement

రబీ సీజన్ ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వేగవంతంగా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో రైతుల నుండి ఫిర్యాదులు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా ఫిర్యాదులు(complaints) వస్తే అధికారులు స్పందించి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. రబీ సీజన్ ప్రారంభం కానున్నందున అన్ని రకాల రసాయనిక ఎరువుల కొరత రాకుండా ముందుస్తుగానే ఎరువులు నిల్వ(Fertilizer storage) చేసుకుని రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. ఎరువుల డింమాండ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎరువుల లభ్యతపై జిల్లాల వారీగా సమీక్షించారు. దిత్వా తుఫాన్ వల్ల కలిగిన నష్టాలను నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ వల్ల దెబ్బతిన్న రహదారులకు మరమత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

సీజనల్ వ్యాధులు నియంత్రణపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టిసారించాలని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్ కలెక్టర్లకు సూచించారు. స్కర్బ్ టైఫస్(Scrub typhus) వ్యాధిపై స్టాండర్డ్ గైడ్లైన్స్ జారీ చేసినట్లు చెప్పారు. టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సిఐఐ సమ్మిట్లో ఎంఓయులు కుదుర్చుకున్న కంపెనీల ఏర్పాటుపై కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని పరిశ్రమలశాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్.యువరాజ్ సమావేశంలో వర్చువల్గా పాల్గోని కలెక్టర్లకు సూచించారు. వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి వీర పాండ్యన్ మాట్లాడుతూ అల్లూరి మన్యం జిల్లాలో మలేరియా వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్కర్బ్ టైఫస్ వ్యాధి నియంత్రణకు వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి పరిక్షలు చేయాలని, ప్రతి శనివారం డ్రైడే నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఅండ్పిఆర్ సంచాలకులు కెఎస్. విశ్వనాధన్, ఆర్టీజిఎస్ సిఈఓ ప్రఖరైజైన్ తదితరులు పాల్గొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

District Collectors Government Meeting K Vijayanand paddy procurement Video conference

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.