జస్టిస్ దొనాడి రమేశ్ ప్రమాణ స్వీకారం
విజయవాడ : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ దొనాడి రమేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈమేరకు శుక్రవారం హైకోర్టు (Donadi Ramesh) మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ రమేశ్ చే న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. గతంలో ఎపి హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తూ జస్టిస్ రమేశ్ అలహాబాద్ హైకో ర్టుకు బదిలీ అయ్యారు.
Read also: పోలీసులకు వ్యాయామం అవసరం

హైకోర్టు మొదటి కోర్టు హాల్లో నిర్వహించిన కార్యక్రమం
మరలా ఎపి హైకోర్టుకు న్యాయమూర్తిగా తిరిగి బదిలీ కావడంతో ఆయనతో చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయ మూర్తులు, హైకోర్టు అడ్వకేట్ (Donadi Ramesh) జనరల్ దమ్మాల పాటి శ్రీనివాస్, అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయ, అదనపు అడ్వకేట్ జనరల్ ఐ సాంబశివ ప్రతాప్, రిజిస్ట్రార్ జనరల్ వైవిఎస్బిజి పార్ధసారధి, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె.చిదంబరం, ఎపి బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎన్. ద్వారకానాధ్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్, పలువురు రిజిస్ట్రార్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ప్రతినిధులు తది తరులు పాల్గొన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: