हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

Telugu News: Justice Gavai: రాజ్యాంగం వల్లే హక్కులపై కోర్టుల్లో అప్పీలు

Sushmitha
Telugu News: Justice Gavai: రాజ్యాంగం వల్లే హక్కులపై కోర్టుల్లో అప్పీలు

విజయవాడ: పౌరుల ప్రాథమిక హక్కులకు (fundamental rights) భంగం కలిగినప్పుడు కోర్టులను ఆశ్రయించే హక్కును భారత రాజ్యాంగం కల్పించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బి.ఆర్. గవాయ్ అన్నారు. 75 ఏళ్ల భారత రాజ్యాంగంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,(Chandrababu Naidu) ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ, సాంఘిక, ఆర్థిక న్యాయ సాధన కోసం రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారని తెలిపారు.

Read also : Dhaka Bomb Blasts : బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు ఉధృతం ఢాకాలో వరుస బాంబు పేలుళ్లు…

Justice Gavai
Justice Gavai

రాజ్యాంగంపై అంబేడ్కర్ ఆలోచన

రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ చేసిన ప్రసంగం ప్రతి న్యాయవాదికి కంఠోపాఠం కావాలని జస్టిస్ గవాయ్(Justice Gavai) చెప్పారు. రాజ్యాంగాన్ని అంబేడ్కర్ ఒక స్థిర పత్రంగా చూడలేదని, కాలానుగుణంగా మార్పులు అవసరమని భావించారని ఆయన తెలిపారు. కొన్ని అంశాల్లో రాజ్యాంగ సవరణ సులభమని, మరికొన్ని అంశాల్లో చాలా కఠినమని చెప్పారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మరుసటి ఏడాదే రిజర్వేషన్ల అంశంపై మొదటి సవరణ చేసుకున్నామని స్పష్టం చేశారు.

పదవీ విరమణకు ముందు చివరి కార్యక్రమం

  • ఎస్సీ వర్గీకరణ: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గతేడాది ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిందని సీజేఐ గుర్తుచేశారు.
  • క్రీమీ లేయర్: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలోనూ క్రిమీ లేయర్ విధానం ఉండాలన్నది తన అభిప్రాయమని జస్టిస్ గవాయ్ వెల్లడించారు.
  • పని ప్రదేశాల్లో వివక్ష: పని ప్రదేశాల్లో మహిళలపై వివక్ష ఉండరాదని విశాఖ కేసు తీర్పులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందని తెలిపారు.
  • చివరి సదస్సు: మరో 2 రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నందున, సీజేఐగా ఇదే తన చివరి కార్యక్రమం అని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. తన స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి కావడం, సీజేఐగా చివరి కార్యక్రమం కూడా ఏపీ రాజధాని ప్రాంతం (అమరావతి)లో జరగడం విశేషమన్నారు.

ఈ సందర్భంగా ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అనేక మైలురాళ్లు అధిగమించామని, ఇప్పటివరకు 106 రాజ్యాంగ సవరణలు జరిగాయని వివరించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870