ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం కేసు వేగంగా మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్తో పాటు ఆయన సోదరుడు రాము అరెస్టయ్యారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ విధించారు. అనంతరం వారిని విజయవాడ సెంట్రల్ జైలుకు తరలించారు. దీంతో నకిలీ మద్యం కేసులో మొత్తం నిందితుల సంఖ్య 23కి చేరింది. జోగి రమేశ్ను A-18గా, ఆయన సోదరుడు రామును A-19గా పోలీసులు పేర్కొన్నారు. ఈ పరిణామంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
Breaking News – Hyderabad : 20 నెలల్లోనే రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు – శ్రీధర్ బాబు
కల్తీ మద్యం కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుండి పోలీసులు దశలవారీగా దర్యాప్తు చేపట్టి, ప్రధాన సూత్రధారులను గుర్తిస్తున్నారు. ఈ కేసు వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలు, ఉత్పత్తి కేంద్రాలు, సరఫరా నెట్వర్క్ పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జోగి రమేశ్ పాత్రపై పోలీసులు విశ్లేషణ జరిపి, సమగ్ర సాక్ష్యాధారాల ఆధారంగా అరెస్ట్ చేసినట్లు సమాచారం. నిందితులు నకిలీ మద్యం తయారీ, పంపిణీలో కీలక పాత్ర పోషించారని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో మరికొందరు నేతలు, వ్యాపారవేత్తల పేర్లు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

అటు జోగి రమేశ్ కుటుంబసభ్యులు ఆయన అరెస్ట్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లిన సమయంలో పోలీసులు, కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. జోగి రమేశ్ నిర్దోషి అని, రాజకీయంగా కక్షసాధింపుల కోసం కుట్ర జరుగుతోందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు మాత్రం అన్ని చర్యలు చట్టప్రకారం జరుగుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/