📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

Latest Telugu News: Kurnool Tragedy: ఛీ..ఛీ..మీరసలు మనుషులేనా .. ఆభరణాల కోసం వెతుకులాట

Author Icon By Vanipushpa
Updated: October 30, 2025 • 4:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్నూలు(Kurnool) బస్సు అగ్నిప్రమాద ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 19 మంది ఆ బస్సులోనే మంటల్లో చిక్కుకుని సజీవదహనం అయ్యారు. ఈ సంఘటన ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే బస్సు ప్రమాదం ఘటనాస్థలిలో బంగారం దొరుకుందని కొంతమంది వెతుకుతున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బస్సులోనే 19 మంది పూర్తిగా కాలిపోవడంతో వారి ఒంటిపై విలువైన ఆభరణాలు కాలిపోయి ఉంటాయని కొందరు వెతుకులాట మొదలు పెట్టారు.

Read Also: Rain Alert: చేతికందిన ధాన్యం డ్రైనేజి పాలయిన వైనం

Kurnool Tragedy

ఆభరణాల కోసం ప్రమాద శిథిలాల వద్ద బూడిదను సేకరించారు

ఈ ప్రమాదంలో ప్రయాణికులు ధరించిన బంగారం, వెండి ఆభరణాలు మంటల్లో కరిగి బూడిదలో కలిసిపోయాయని భావించిన కొందరు స్థానికులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. ఆభరణాల కోసం… వారు బస్సు ప్రమాద శిథిలాల వద్ద ఉన్న బూడిదను సంచుల్లో సేకరించారు. ఆ తర్వాత ఆ బూడిద సంచులను ప్రమాద స్థలికి దగ్గరలో ఉన్న ఒక కుంట వద్దకు తీసుకెళ్లి, నీటిలో కడిగి మరీ కరిగిపోయిన బంగారాన్ని, ఇతర ఆభరణాలను వెతికినట్లుగా తెలుస్తోంది. ఈ హృదయ విదారక ఘటనపై దేశవ్యాప్తంగా సానుభూతి వ్యక్తమవుతున్న సమయంలో, మృతుల ఆభరణాల కోసం కొందరు ఇలా వెతకడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిజంగా సిగ్గుచేటు.. నెటిజన్లు మండిపాటు

చనిపోయారన్న బాధ కనీసం లేకుండా ఇలాంటి పనిచేయడం నిజంగా సిగ్గుచేటు అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇది శవాల మీద పేలాలు ఏరుకోవటం అంటే ఇదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇది మానవత్వం మంటగలిసిన ఘటనగా అభిప్రాయపడుతున్నారు. ఇంతకన్నా దారుణం మరోకటి ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper :  epaper.vaartha.com/

Read Also:

Crime Human Behavior Humanity jewellery theft Moral values SOCIETY Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.