📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Janasena: పిఠాపురం జనసంద్రం: కాసేపట్లో ‘జయకేతనం’ సభ

Author Icon By Divya Vani M
Updated: April 7, 2025 • 4:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Janasena: పిఠాపురం జనసంద్రం: కాసేపట్లో ‘జయకేతనం’ సభ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభకు వేడుకల వాతావరణం నెలకొంది. ఈ మహాసభ కాసేపట్లో పిఠాపురం మండలంలోని చిత్రాడలో ప్రారంభం కానుంది. ప్రత్యేకత ఏమిటంటే జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి ఆవిర్భావ వేడుక. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా, విదేశాల్లో ఉన్న జనసైనికులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పిఠాపురం ప్రాంగణం జనసేన శ్రేణులతో కిక్కిరిసిపోయి, సందడి వాతావరణం నెలకొంది. సభాస్థలి చుట్టూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వాగత మార్గాలను కొబ్బరి ఆకులు జనసేన జెండాలు, భారీ ఫ్లెక్సీలతో అలంకరించారు. కార్యకర్తల సందడి నినాదాలతో అక్కడి వాతావరణం ఉత్సాహభరితంగా మారింది. సభలో గందరగోళం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సభకు భారీగా అభిమానులు, కార్యకర్తలు హాజరవుతుండటంతో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.

Janasena పిఠాపురం జనసంద్రం కాసేపట్లో ‘జయకేతనం’ సభ

మొత్తం 1,700 మంది పోలీసులను నియమించారు వీరికి తోడుగా 500 మంది పార్టీ వాలంటీర్లు భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. అనుకోని పరిస్థితులకు 14 అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచారు. ప్రాంగణంలోని ప్రదేశాల్లో ఎక్కడికక్కడ వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. జనసేన శ్రేణులకు అసౌకర్యం కలగకుండా ఆరు ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చారు. అదే విధంగా సభకు వచ్చిన వారికి భోజన వసతి కల్పించేందుకు నాలుగు ప్రధాన ప్రాంతాల్లో అన్నదానం ఏర్పాటు చేశారు. ఎండ తాపాన్ని దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు.జనసేనాని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు.

ఆయన ప్రసంగాన్ని ఆస్వాదించేందుకు అభిమానులు పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనసేన భవిష్యత్తు కార్యచరణపై పవన్ స్పష్టత ఇవ్వబోతారని, పార్టీ అభివృద్ధి దిశగా కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పాలనలో భాగస్వామ్యంగా మారిన జనసేన పార్టీ, తన రాజకీయ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఈ వేడుకను ఉపయోగించుకోనుంది. అధికారం వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న సభ కావడంతో జనసైనికుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై పవన్ స్పష్టత ఇచ్చే అవకాశముంది.ఈ మహాసభలో ఏయే అంశాలు చర్చకు వస్తాయో, పవన్ కల్యాణ్ ఏమి ప్రకటించబోతారో అన్న ఉత్కంఠతో జనసేన అభిమానులు ఎదురుచూస్తున్నారు.

AndhraPradesh DeputyCM Janasainikulu Janasena Janasena12Years JanasenaAvirbhavaSabha PawanKalyan pithapuram

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.