हिन्दी | Epaper
అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం

Jakkampudi : నన్నయ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై జక్కంపూడి రాజా తీవ్ర ఆగ్రహం

Sudheer
Jakkampudi : నన్నయ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై జక్కంపూడి రాజా తీవ్ర ఆగ్రహం

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో రాజకీయ నాయకుల బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాసంస్థల్లో రాజకీయ చిహ్నాలు, రంగులు ప్రదర్శించకూడదనే కనీస ఇంగిత జ్ఞానం ప్రస్తుత ప్రజాప్రతినిధులకు లేదని ఆయన మండిపడ్డారు. అర్ధరాత్రి సమయంలో యూనివర్సిటీలోకి చొరబడి సైకిల్, గ్లాస్ గుర్తులున్న బ్యానర్లు కట్టడం నిబంధనలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో తాము విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేశామని, కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిపోతోందని, ఉపకులపతులను (VCs) భయపెట్టి బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Breaking News: Droupadi Murmu: VB-G RAM G బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి

యూనివర్సిటీలో జరుగుతున్న తప్పులను ప్రశ్నించినందుకు ఉన్నత విద్యావంతుడైన వీసీపై మరియు అడ్డుకున్న అటెండర్‌పై దారుణంగా దాడి జరగడంపై రాజా విరుచుకుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే బలరామకృష్ణ మరియు ఆయన సతీమణి బత్తుల వెంకటలక్ష్మి వీసీని కులం పేరుతో దూషించారని, ఇది అత్యంత దారుణమని ఆయన పేర్కొన్నారు. కనీసం 8వ తరగతి కూడా పాస్ అవ్వని వారు, ఒక యూనివర్సిటీ వీసీని ప్రశ్నించడం మరియు దూషించడం రాష్ట్రంలో ఉన్న అరాచక పరిస్థితులకు అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. ఏ హోదాలో ఎమ్మెల్యే సతీమణి యూనివర్సిటీలోకి ప్రవేశించి వీసీని ప్రశ్నించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

నన్నయ యూనివర్సిటీ నిర్మాణంలో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ, తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు వేసిన పునాది రాయిని ప్రస్తుత పాలకులు తొలగించడాన్ని ఆయన తప్పుబట్టారు. గత ప్రభుత్వ హయాంలోనే యూనివర్సిటీ భవనాలు పూర్తయ్యాయని, తాము అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తే, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రచార పిచ్చితో గొడవలు సృష్టిస్తున్నారని విమర్శించారు. నాయకులు ఏ మార్గంలో వెళ్తే వారి అనుచరులు (చంచాలు) అదే మార్గాన్ని అనుసరిస్తున్నారని, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరమని హెచ్చరించారు. గడిచిన రెండేళ్లలో యూనివర్సిటీ కోసం ఎమ్మెల్యే ఏం చేశారో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870