ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘ఏఐ సమ్మిట్’ (AI Summit) ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి వేదికైంది. ఈ సమ్మిట్లో కాంగ్రెస్ నేతలు నిర్వహించిన నిరసనలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించడాన్ని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా తప్పుబట్టారు. జగన్ ప్రదర్శిస్తున్నది “నకిలీ సానుభూతి” అని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ ఎన్నో అడ్డంకులు సృష్టించారని, ఇప్పుడు మాత్రం ఏమీ తెలియనట్లు నీతులు చెబుతున్నారని లోకేశ్ తన సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడుల సదస్సును రాజకీయ కోణంలో కాకుండా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చూడాలని జగన్ చేసిన వ్యాఖ్యలకు లోకేశ్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
LocalBody elections: ఎన్నికల కౌంట్డౌన్.. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కీలక నిర్ణయం
మంత్రి లోకేశ్ తన విమర్శల్లో జగన్ గత రాజకీయ చరిత్రను మరియు నిర్ణయాలను ఎండగట్టారు. 2017లో విశాఖలో జరిగిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కు అంతరాయం కలిగించేలా ఎయిర్పోర్టులో ధర్నా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే 2019లో అధికారంలోకి రాగానే గ్లోబల్ ఇన్వెస్టర్లతో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడం, 2020లో అమరావతి-సింగపూర్ ఒప్పందాన్ని పక్కన పెట్టడం వంటివి రాష్ట్ర పారిశ్రామిక రంగానికి పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు. చివరకు 2025లో రాష్ట్రానికి రుణాలు రాకుండా ఆర్బీఐకి (RBI) లేఖలు రాసిన చరిత్ర జగన్దేనని లోకేశ్ ఆరోపించారు. ఇలా వరుసగా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్న వ్యక్తి, ఇప్పుడు ఏఐ సమ్మిట్ పట్ల ప్రేమ వలకబోయడం విడ్డూరంగా ఉందని ఆయన తన కథనంలో పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com