📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Jagan: వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి సీఎం జగన్ పరామర్శ

Author Icon By Sharanya
Updated: May 13, 2025 • 3:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్థాన్ సైన్యం కాల్పుల్లో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్ మురళీ నాయక్‌ కుటుంబానికి ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం పరామర్శనకు వెళ్లారు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి పర్యటన మాత్రమే కాకుండా, ఒక బాధిత కుటుంబానికి తాను అండగా ఉన్నానని చెప్పిన మానవతా దృక్పథం.

Jagan:

బెంగళూరులోని తన నివాసం నుంచి ప్రత్యేకంగా రోడ్డు మార్గంలో ప్రయాణించి శ్రీసత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, కల్లి తండా గ్రామానికి చేరుకున్న జగన్, జవాన్ తల్లిదండ్రులు శ్రీరాం నాయక్ మరియు జ్యోతిబాయిలతో మాట్లాడారు. ముర‌ళీ నాయ‌క్ ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, ఆయ‌న అంద‌రికీ స్ఫూర్తిదాయ‌క‌మ‌ని అన్నారు. 

మురళీ నాయక్ తండ్రి భావోద్వేగ వ్యాఖ్యలు

జగన్ నివాళులు అర్పిస్తున్న సమయంలో మురళీ నాయక్ తండ్రి స్పందిస్తూ “మురళీ నీ కోసం జగనన్న వచ్చాడు లేచి సార్ కి సెల్యూట్ కొట్టరా” అంటూ అనడం అక్కడున్న అందరినీ కదిలించింది.

25ల‌క్ష‌ల ఆర్థిక సాయం 

ముర‌ళీ నాయ‌క్ చేసిన త్యాగానికి దేశం రుణ‌ప‌డి ఉంటుంద‌న్నారు. వైసీపీ త‌ర‌ఫున వీర జ‌వాన్ కుటుంబానికి రూ. 25ల‌క్ష‌ల ఆర్థిక సాయం ప్ర‌క‌టించారు. ముర‌ళీ నాయ‌క్ కుటుంబానికి త‌మ పార్టీ అన్ని విధాలుగా అండ‌గా ఉంటుందని జ‌గ‌న్ భ‌రోసా ఇచ్చారు. అనంత‌రం ఆయ‌న తిరుగు ప‌య‌న‌మ‌య్యారు. జగన్ పరామర్శ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మురళీ కుటుంబానికి రూ. 50 లక్షల ఆర్థిక సాయం, ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒక‌రికి ప్ర‌భుత్వ ఉద్యోగం ఇస్తామ‌ని ప్రకటించిన విష‌యం తెలిసిందే. అలాగే డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న వ్య‌క్తిగ‌తంగా ముర‌ళీ నాయ‌క్ కుటుంబానికి రూ. 25 ల‌క్ష‌లు ఇస్తానని ప్ర‌క‌టించారు.

Read also: Vijayawada: కూల్ డ్రింక్ వ్యాన్ బోల్తా వాటిని తీసుకెళ్లడానికి పోటీ పడ్డ జనాలు

#AndhraPradesh #indianarmy #JaganWithFamilies #MuraliNaik #SaluteToBravery #TributeToSoldiers #VeerJawan #YSJagan Breaking News Today In Telugu Google News in Telugu India News Today in Telugu Latest News in Telugu Latest News today in Telugu News in Telugu Today Telugu News Today Today News In Telugu Today Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.