ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) నేడు గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. ఇటీవల పోలీసుల హింసకు గురై గాయపడిన జాన్ విక్టర్ కుటుంబాన్ని (John Victor’s family) పరామర్శించేందుకు ఆయన ఈ పర్యటన చేపడుతున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పర్యటన కొనసాగనున్నట్లు వైసీపీ వర్గాలు ప్రకటించాయి. ఈ సందర్భంగా స్థానిక వైఎస్సార్సీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి.
పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు
జాన్ విక్టర్ను పోలీసులు నడిరోడ్డుపై బలవంతంగా కొట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో జాన్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా, పౌర హక్కుల పరిరక్షణ కోసం పలువురు ప్రముఖులు స్పందించారు. ఈ నేపథ్యంలో జగన్ స్వయంగా ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు ముందుకు రావడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది.
హోంమంత్రి అనిత తీరుపై విమర్శలు
ఈ ఘటనపై హోం మంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు మరో వివాదాన్ని తీసుకొచ్చాయి. ఆమె సమర్థించుకున్న తీరుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని, జగన్ వ్యక్తిగతంగా బాధితులను పరామర్శించేందుకు ముందడుగు వేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also : AP : 9 ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీటీ స్కాన్, క్యాథ్ ల్యాబ్ లు