ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “జగన్ ఇప్పుడు కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. సీఎం కాదు” అని స్పష్టం చేశారు. జగన్తో పాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి ప్రతిబింబం. ప్రజల తరఫున ఇక్కడ మాట్లాడటం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత. కానీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆ బాధ్యతను విస్మరిస్తున్నారు” అని స్పీకర్ వ్యాఖ్యానించారు.
Latest News: TG: ఈ నెల 19న మహిళలకు చీరల పంపిణీ
అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, “జగన్ గారికి అసెంబ్లీలో కూడా సాధారణ ఎమ్మెల్యేకు ఇచ్చే సమయమే ఇస్తాం. ఆయనకు ప్రత్యేక హోదా లేదు. మీడియా ముందు మాట్లాడటంకంటే అసెంబ్లీలో మాట్లాడటమే సరైన వేదిక” అని అన్నారు. జగన్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం కూడా సూచిస్తూ, “నా ముందు ‘అధ్యక్షా’ అని పిలవడం ఆయనకు ఇష్టంలేకే వస్తంలేదు” అని ఎద్దేవా చేశారు. ఇటువంటి ధోరణి ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానకరమని, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు అసెంబ్లీని వదిలేయడం తగదని స్పీకర్ హెచ్చరించారు.

స్పీకర్ ఇంకా మాట్లాడుతూ, “వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ నిధుల నుంచి జీతాలు, భత్యాలు తీసుకుంటున్నారు. కానీ, అసెంబ్లీ సమావేశాలకు మాత్రం హాజరుకావడం లేదు. ఇది ప్రజల పన్నుల డబ్బుతో అన్యాయం చేయడమే” అని విమర్శించారు. ప్రజల సమస్యలు, ప్రాంతీయ అభివృద్ధి, విధాన చర్చలు జరగాల్సిన వేదిక అయిన అసెంబ్లీని రాజకీయ వ్యూహాల కోసం దూరం చేయడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. రాజకీయ భేదాలు ఎన్ని ఉన్నా, ప్రజాస్వామ్య పద్ధతిలో మాట్లాడటమే నాయకుల బాధ్యత అని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీశాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/