YS Jagan Ugadi Celebrations 2026: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కార్యాలయం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సతీమణి వైఎస్ భారతితో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
Read Also: TTD: తిరుమల ప్రసాదాల స్వచ్ఛతకు ఫుడ్ సేఫ్టీ ల్యాబ్
సంప్రదాయబద్ధంగా జగన్ దంపతులు
ఈ ఉగాది వేడుకల కోసం పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంచ కట్టులో, ఆయన సతీమణి సంప్రదాయ దుస్తులు ధరించి హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. పిడపర్తి భాస్కర సుబ్రమణ్యేశ్వర శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: