జగన్ రాజకీయాలను నేరపూరితంగా మార్చారు – సీఎం చంద్రబాబు

Read Time:  1 min
భయపడను చంద్రబాబుకి జగన్ కౌంటర్
భయపడను చంద్రబాబుకి జగన్ కౌంటర్
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షుల అనుమానాస్పద మరణాలపై సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజకీయ ముసుగులో నేరస్థులు పెరిగిపోతున్నారని, ప్రజలు ఈ విషయాన్ని గమనించి జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన హెచ్చరించారు. తన స్వలబ్ధి కోసం వైఎస్ జగన్ రాజకీయ వ్యవస్థను నేరపూరితంగా మార్చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వివేకా హత్య కేసులో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కుట్రలు

వివేకా హత్య కేసులో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కుట్రలు జరుగుతున్నాయన్నారు. మొదట ఆయన గుండెపోటుతో మరణించారని ప్రచారం, తర్వాత గొడ్డలి వేటుతో హత్య అని ప్రకటించారని, చివరికి తనపైనే ఆరోపణలు మోపే ప్రయత్నం చేశారని విమర్శించారు. అంతే కాకుండా, వివేకా సోదరి సునీతను కూడా నిందితురాలిగా చూపించే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు.

ys viveka

న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్కరికీ వైసీపీ ప్రభుత్వం బెదిరింపు

ఇలాంటి అత్యాచార రాజకీయాలను ప్రజలు అంగీకరించరాదని, న్యాయం కోసం పోరాడే ప్రతి ఒక్కరికీ వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు దిగిందని, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన ఐదుగురు సాక్షులు అనుమానాస్పదంగా మరణించారని ఆయన గుర్తుచేశారు.

ఈ అంశాన్ని కేంద్ర సంస్థల దృష్టికి తీసుకెళ్లి, న్యాయబద్ధమైన దర్యాప్తు జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజకీయ అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ ప్రభుత్వం చేసే అరాచకాలను ప్రజలు అర్ధం చేసుకోవాలని సూచించారు. నేరపూరిత పాలనకు ముగింపు పలకడం కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడం కోసం అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.