ఆధ్యాత్మికమైన పండుగలలో ఒకటైన తొలి ఏకాదశి (Tholi Ekadashi) పర్వదినం సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ (Jagan) రెడ్డి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

జగన్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ,
ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, రాష్ట్ర ప్రజలందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆషాడ శుద్ధ ఏకాదశిని భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, శ్రీ మహా విష్ణువు (Lord Vishnu) ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
వైఎస్ జగన్ (Jagan) తరచుగా రాష్ట్ర ప్రజల ఆధ్యాత్మికాభిరుచిని గౌరవిస్తూ, ఆయా పర్వదినాల్లో సోషల్ మీడియా ద్వారా తన అభినందనలు తెలియజేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా కూడా ఆయన ప్రజల క్షేమసంపదల కోసం శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభించాలి అనే ప్రార్థన చేశారు.
తొలి ఏకాదశి విశిష్టత
ఆషాడ మాసం శుక్లపక్షంలో వచ్చే తొలి ఏకాదశి (పదకొండవ తేదీ) శయన ఏకాదశిగా పిలవబడుతుంది. హిందూ సంప్రదాయంలో ఈ ఏకాదశికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లినట్లు నమ్మకం. ఈరోజు నుండి నాలుగు నెలల వరకూ చాతుర్మాస్యం మొదలవుతుంది. భక్తులు ఉపవాసం ఉండటం, జపతపాలు చేయటం, విశేష పూజలు నిర్వహించటం వంటి విధుల ద్వారా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి పెరుగుతున్న వరద ప్రవాహం
Women Employees: ఏపీ మహిళా ఉద్యోగులకు శుభవార్త.. పిల్లల సంరక్షణకు క్రెష్లు ఏర్పాటు