ఆంధ్రప్రదేశ్లో భారీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. డబ్బు లెక్కిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తీవ్రంగా స్పందించారు. ఈ దృశ్యాల వెనుక ఉన్న అసలైన కథ గురించి ప్రజలకు తెలుసు కావాలంటూ వ్యాఖ్యానించారు.తిరుపతిలో బీజేపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి జగన్ (Jagan) కు అత్యంత సన్నిహితుడు కాదా? అంటూ ఆయన ప్రశ్నించారు. వేల కోట్ల లావాదేవీల వెనుక ఉన్న అసలైన పాపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయన్నారు.

మద్యం మాఫియాలో వైసీపీ ప్రమేయం ఉందా?
మంత్రి సత్యకుమార్ (Minister Satyakumar) ఆరోపించినట్టు, గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలపై పూర్తిగా ఆధారపడిందని తెలిపారు. “ప్రజల రక్తాన్ని పీల్చి వేల కోట్లు దోచుకున్నారు. ఇప్పుడు ఆ డబ్బే బయటపడుతోంది” అని ఆయన మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం పై ఆయన ఘాటుగా విమర్శలు గుప్పించారు.”తనపై తానే దాడులు చేయించుకుంటున్నట్టు నటిస్తున్న జగన్కి జైలు భయం పట్టుకుంది” అని మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజల కోసం డ్రామాలు ఆడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు చేసే పని మీద విమర్శలు చేయడం కూడా అదే భయానికి సూచన అని వివరించారు.
నాటకాలు కాదు – నిజాల సమయం వచ్చిందన్న మంత్రి
“తప్పులు చేసినవారిని చట్టం వదిలిపెట్టదు. నాటకాలతో తప్పించుకునే రోజులు పోయాయి. అసలు దోషులు ఎవరో ప్రజల ముందుకు త్వరలోనే వస్తారు” అని మంత్రి ధీమాగా చెప్పారు. ఈ కేసును ప్రభుత్వం పట్టువదలకుండా ముందుకు తీసుకెళ్తుందన్నారు.వైసీపీ నేతలు తమకు సంబంధం లేదని చెప్పడాన్ని మంత్రి ఎద్దేవా చేశారు. పాపం ఎరగని వారు లాంటి పాత్రలు పోషిస్తున్నారు. కానీ, పబ్లిక్ అన్నీ గమనిస్తోంది అని వ్యాఖ్యానించారు. మద్యం మాఫియా వెనక ఉన్న అసలు పాత్రలు ఒక్కొక్కటిగా బయటపడతాయని అన్నారు.
రాజకీయ డ్రామాలేనా? లేక వాస్తవానికి అడ్డంగా దొరికిపోతున్నరా?
ఈ లిక్కర్ స్కాంలో రాజకీయ నాయకుల ప్రమేయంపై జనాల్లో ఆసక్తి పెరుగుతోంది. వీడియో, ఆర్థిక లావాదేవీలు, అనుమానాస్పద వ్యక్తులు… ఇవన్నీ కలిపి కేసు మరింత వేడెక్కుతోంది. చట్టం నిజాలను వెలికితీయడం ఎంత త్వరగా జరుగుతుందో వేచి చూడాలి.
Read Also : Tollywood : టాలీవుడ్లో మోగిన సమ్మె సైరన్.. రేపటి నుంచి షూటింగ్స్ బంద్