Jagan Brahmanandam Meet: విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం ఒక ఆసక్తికర సన్నివేశానికి వేదికైంది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం మర్యాదపూర్వకంగా కలిశారు. విమానాశ్రయంలో వీరిద్దరూ పలకరించుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.
Read Also: Bombay High Court Judgment: బిడ్డ గుర్తింపునకు తల్లి పేరే చాలు
రాజకీయ, సినీ వర్గాల్లో చర్చ
వైఎస్ జగన్, బ్రహ్మానందం(Brahmanandam)ల మధ్య ఈ కలయిక అకస్మాత్తుగా జరగడంతో అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ పరిశ్రమలోనూ చర్చ మొదలైంది. వీరిద్దరూ కొద్దిసేపు ముచ్చటించుకున్నప్పటికీ, వారి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వివరాలు మాత్రం బయటకు రాలేదు. హాస్యబ్రహ్మగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న బ్రహ్మానందంను ఇలా రాజకీయ నాయకుడితో చూడటం అభిమానులను ఆకట్టుకుంటోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: