పొదిలిలో జరిగిన రాళ్లదాడి ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత (Anitha) తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన వెనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాల ప్రమేయం ఉన్నదని ఆమె ఆరోపించారు. “జగన్ మార్క్ అరాచకం మళ్లీ బయటపడింది. మహిళలపై, పోలీసులపై కూడా రాళ్లతో దాడికి తెగబడ్డారు. శాంతి భద్రతలను అభద్రతంగా చేసి, దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు” అంటూ అనిత మండిపడ్డారు.
ఘర్షణలకు గూండాలే కారణం
అనిత మాటల ప్రకారం,, గుంపులుగా కూడిన వైసీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా ఘర్షణలకు దారితీశారని, తర్వాత తమపై విమర్శలు మోపేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. “వారు సృష్టించిన సమస్యలనే ప్రజల కళ్లకు చర్మించేందుకు విపరీత ప్రచారాన్ని చేస్తున్నారు. ఇటువంటి మోసపూరిత చర్యలు ప్రజలు ఆమోదించరని,” ఆమె చెప్పారు.
మహిళలకు క్షమాపణ చెప్పాలి
వైసీపీ నాయకులైన కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు మహిళల మనసును గాయపరిచాయనీ, రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అనిత చెప్పారు. “మహిళలకు జరిగిన అవమానానికి జగన్, ఆయన భార్య భారతి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మహిళల గౌరవానికి పెద్దపీట వేస్తుందని, ఏవైనా దాడులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
Read Also : UPI లావాదేవీలపై MDR ఛార్జీలు ఉండవు – కేంద్రం