ఆంధ్రప్రదేశ్(AP) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన “దిష్టి” వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. కోనసీమ పచ్చదనాన్ని చూసి తెలంగాణ నేతల దిష్టి పడిందని పవన్ చేసిన వ్యాఖ్యపై తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్(PAWAN) మాట్లాడిన తీరు బాధ్యతారాహిత్యమనీ, ఆలోచించకుండా మాట్లాడడం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు.
Read Also: CID: చంద్రబాబుకి భారీ ఊరట CID కేసు క్లోజ్..

ఏపీ ప్రజలు ఉద్యోగాలు, వ్యాపారాల
“మా దిష్టి ఏపీకి తగిలిందని చెప్పడం అర్థరహితం. అంతేకాదు, ఇన్నేళ్లుగా ఏపీలోని నాయకుల దుష్టిదృష్టే తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలిగించింది” అని జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రతిరోజూ వేలాది మంది ఏపీ ప్రజలు ఉద్యోగాలు, వ్యాపారాల కోసం హైదరాబాద్ను ఆశ్రయిస్తున్నప్పుడు, దిష్టి ఎలా తగులుతుందో పవన్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు. దిష్టి భయముంటే దిష్టిబొమ్మ పెట్టుకోవాలని, దానిని ఎవ్వరూ అడ్డుకోరని వ్యంగ్యంగా అన్నారు. “ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారు ఉప ముఖ్యమంత్రులుగా ఉండటం నిజంగా ఆశ్చర్యం” అని ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఇక, పవన్ కల్యాణ్ తాజాగా రాజోలు (కోనసీమ)లో జరిగిన ‘పల్లె పండుగ 2.0’(palle panduga 2.0) కార్యక్రమంలో పాల్గొని, కోనసీమ పచ్చదనమే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం ఆలోచనకు కారణమై ఉండొచ్చని వ్యాఖ్యానించారు. అలాగే, “మనిషి దిష్టికి రాయి కూడా పగిలిపోతుంది” అంటూ ఉపమానాలు ఇచ్చారు.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో చర్చ జరుగుతోంది. జగదీశ్ రెడ్డి కౌంటర్తో రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠకు చేరింది. ఈ మాటల యుద్ధం మరింత ఎటు దారి తీస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: