📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

YCP : ఇంత మంచి చేసి ఓడిపోవడం షాకే – సజ్జల

Author Icon By Sudheer
Updated: July 24, 2025 • 10:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala) ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ ఓటమిపై స్పందించారు. “ఇంత మంచి పాలన చేసిన తర్వాత కూడా ప్రజలు మమ్మల్ని తిరస్కరించడం పెద్ద షాక్. కానీ మేము గాయపడలేదు.. గమ్యాన్ని మార్చలేదు,” అని అన్నారు. గత ప్రభుత్వంలో తీసుకున్న మంచి నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు మర్చిపోలేరని అన్నారు.

పార్టీ పునర్నిర్మాణంలో జగన్ చొరవ

సజ్జల ప్రకారం, పార్టీ పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో కొత్తగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నేతలను నియమిస్తున్నారు. ప్రతిరోజూ వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సుమారు 200 మంది కార్యకర్తలను కలుసుకుని వారితో భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారని తెలిపారు.

ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యం

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ప్రభుత్వ అవినీతి, ప్రజలపై భారం వేస్తున్న విధానాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని సజ్జల పేర్కొన్నారు. “వైసీపీ ప్రజల కోసం పని చేయడం మానదు. అధికారంలో లేని సమయంలోనూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం. ఇది మా కర్తవ్యమనీ, పార్టీ కార్యకర్తల ఇంకా బలంగా ఉందని” స్పష్టం చేశారు.

Read Also : AP : కొత్తగా 2వేల కి.మీ. రోడ్ల నిర్మాణం – సీఎం చంద్రబాబు

Google News in Telugu Jagan sajjala ycp

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.