📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

News Telugu: IT Raids: తెలుగు రాష్ట్రాల్లో 25 చోట్ల అధికారుల తనిఖీలు

Author Icon By Rajitha
Updated: October 8, 2025 • 12:33 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు రాష్ట్రాల్లో 25 చోట్ల అధికారుల తనిఖీలు ఐటి సోదాల IT Raids కలకలం సచివాలయం : రాష్ట్ర వ్యాప్తంగా మరో పెద్ద పప్పుల దందా వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.300కోట్ల విలువైన పప్పుల వ్యాపారంలో బారీ అవకతవకలు అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఆదాయపు పన్ను మంగళవారం తెల్లవారు జామునే సోదాలు ప్రారంభించింది. విజయవాడ, గుంటూరు, విశాఖపట ్నం, కర్నూలు, హైదరాబాద్ Hyderabad నగరాల్లో ఒకేసారి సోదాలు జరిగాయి. పప్పుల సరఫరా పేరుతో ప్రభుత్వ నిధులను మలచినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఐటి శాఖాధికారులు రాష్ట్రంలోని 25 ప్రదేశాల్లో సోదాలు జరిపారు. విశాఖలో హిందూ స్తాన్ ట్రేడర్స్, కర్నూల్లో వికేర్ గ్రూప్, గుంటూరులో Guntur మరికొన్ని ప్రముఖ పప్పు ట్రేడింగ్ కంపెనీలు దర్యాప్తు కిందకొచ్చాయి. ఒకేసారి పలు బృందాలు పనిచేయడంతో వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం నెలకొంది.

YS Jagan: హెలికాప్టర్‌లో మాత్రమే జగన్ కు అనుమతి!

IT Raids

గత ప్రభుత్వ హాయాంలో సివిల్ సప్లయిస్ శాఖ నుంచి టెండర్లు పొంది పెద్దమొత్తంలో పప్పులు సరఫరా చేశామని చూపించి వందల కోట్లు బిల్లు వేసుకున్నట్లు తెలిసింది. చెల్లింపులు అయిన తర్వాత పప్పులు అందించడం కొన్ని చోట్ల సరఫరానే నిలిపి వేయడం వంటి అంశాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో భారీ క్యాష్ ఉపసంహరణలు దర్యాప్తులో ఐటి అధికారులు 2024 ఎన్నికల ముందు పెద్ద మొత్తం నగదు ఉపసంహరణలు జరిగినట్లు గుర్తించారు. ఈ లావాదేవీల వెనుక రాజకీయ సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా ఐటి వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఐటి దాడుల తర్వాత సివిల్ సప్లైస్ శాఖలోనూ చురుగ్గా కదలికలు ప్రారంభమయ్యాయి. ఏఏ టెండర్లు ఎవరికిచ్చారు? చెల్లింపులు ఎప్పుడు జరిగాయి. ? అనే వివరాలను అధికారులు తేలుస్తున్నారు.

రాజకీయ వర్గాల్లో చర్చ

ఈ దాడులతో రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎవరి అనుమతితో ఈ టెండర్లు కుదిరాయి? ఎవరి మార్గదర్శకత్వంలో చెల్లింపులు జరిగాయి అనేప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పలు కంపెనీలు పన్ను ఎగవేత, బోగస్ సరఫరా, హవాలా లావాదే వీల్లో నిమగ్నమైనట్లు ఆధారాలు లభించాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఐటీ శాఖ ఎందుకు సోదాలు జరిపింది?
రూ.300 కోట్ల విలువైన పప్పుల వ్యాపారంలో అవకతవకలు, అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించడంతో ఐటీ శాఖ రాష్ట్రవ్యాప్తంగా సోదాలు చేపట్టింది.

ఐటీ అధికారులు ఎక్కడెక్కడ సోదాలు నిర్వహించారు?
విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, హైదరాబాద్ నగరాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 25 ప్రదేశాల్లో సోదాలు జరిగాయి.

Read hindi news: hindi.vaartha.com

EPaper: https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh IT Raids latest news pulses scam Telangana Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.