Raghurama Torture Case: రఘురామ కేసు.. సునీల్ నాయక్ అరెస్ట్

Read Time:  1 min
Raghurama Torture Case: రఘురామ కేసు.. సునీల్ నాయక్ అరెస్ట్
FONT SIZE
GET APP

Raghurama Torture Case: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏపీ పోలీసులు భారీ యాక్షన్ తీసుకున్నారు. ప్రస్తుతం బీహార్‌లోని పాట్నాలో ఐజీగా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన బీహార్ లోని పాట్నాలో ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సమయంలో సునీల్ నాయక్ స్వయంగా ఉండి పర్యవేక్షించారని రఘురామకృష్ణరాజు గతంలో ఫిర్యాదు చేశారు.

Read Also: AP Inter Exams 2026: నేటి నుంచి ఇంటర్ పబ్లిక్‌ పరీక్షలు

 Raghurama custodial torture case.. IPS Sunil Nayak arrested
Raghurama custodial torture case.. IPS Sunil Nayak arrested

విచారణకు గైర్హాజరు.. అందుకే ఈ నిర్ణయం!

ఈ మేరకు కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ, గత కొంతకాలంగా సునీల్ నాయక్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసింది. అయితే ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో, ఏపీ పోలీసులు నేరుగా పాట్నా వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బీహార్ ప్రభుత్వానికి, స్థానిక అధికారులకు సమాచారం అందించిన తర్వాతే ఈ అరెస్ట్ ప్రక్రియ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనను ఆంధ్రప్రదేశ్ కు, తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులపై విచారణ జరుగుతుండగా.. సునీల్ నాయక్ అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాలతో పాటు అటు పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.