📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Tirupati : తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఎల్లుండి నుంచి విచారణ

Author Icon By Sudheer
Updated: April 7, 2025 • 3:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుపతి ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణకు ఏక సభ్య కమిషన్‌ను నియమించింది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సమగ్రంగా పరిశీలించేందుకు ఆయన ప్రత్యక్షంగా క్యూలైన్ల నిర్వహణ తీరును ఇవాళ, రేపు పరిశీలించనున్నారు.

క్యూలైన్ల నిర్వహణపై సమీక్ష

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రదేశాలను, భక్తుల ప్రవాహాన్ని ఎలా నియంత్రించాలి అనే అంశాలను కమిషన్ బృందం ప్రత్యేకంగా అధ్యయనం చేయనుంది. టీటీడీ నిర్వహణ, భక్తుల ఆహార, తాగునీరు, క్యూలైన్ల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై అధికారులు కమిషన్‌కు నివేదిక సమర్పించనున్నారు. భక్తుల రద్దీ నియంత్రణలో ఏవైనా లోపాలున్నాయా? భద్రతాపరంగా మరిన్ని మార్పులు అవసరమా? అనే విషయాలపై ప్రత్యేకంగా సమీక్ష చేపట్టనున్నారు.

tirupati stampede enquiry

బాధితుల అభిప్రాయాలను నమోదు

ఎల్లుండి నుంచి అధికారికంగా విచారణ మొదలుకానుంది. ఈ సందర్భంగా టీటీడీ, పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులతో పాటు తొక్కిసలాటలో గాయపడిన భక్తులను కూడా కమిషన్ విచారించనుంది. ఘటనకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురానున్నారు.

అధికారులకు నోటీసులు జారీ

ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, టీటీడీ ఈవోలకు ఇప్పటికే నోటీసులు పంపినట్లు సమాచారం. భక్తుల భద్రత విషయంలో ప్రభుత్వ విధానాలను, అధికారుల బాధ్యతలను సమీక్షించేందుకు కమిషన్ చర్యలు తీసుకుంటోంది. భక్తుల సంక్షేమం, భద్రత పెంపునకు కమిషన్ సూచనలు ఇవ్వనుంది.

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today tirupati stampede tirupati stampede enquiry Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.