📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Today News : Inquiry – మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై మూడోసారి విచారణ

Author Icon By Shravan
Updated: August 23, 2025 • 11:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ Inquiry : ఏపీ లిక్కర్ కేసులో (AP liquor case) కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని సిట్ విచారణ రావాలని ఆదేశించింది. లిక్కరు స్కామ్ కేసులో సిట్ దూకుడు ప్రదర్శింస్తూంది. నిందితులను ఒక్కొక్కరిగా బయటకు లాగుతుంది. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో రాయణ స్వామిని విచారణకు రావాలని సిట్ అధికారులు కోరినట్లు తెలిపారు. లిక్కరు స్కామ్కు సంబంధించి ఆయన కీలక సాక్షిగా ఉండారని గతంలో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య కారణాలతో విచారణకు గైర్హాజరు కాలేనని చెప్పడంతో వర్చువల్గా సిట్ విచారినట్లు సమాచారం. ఇక శుక్రవారం నారాయణ స్వామిని సిట్ మరో పర్యాయం ఆయన ఇంట్లోనే వర్చువల్గా విచారించింది. దాదాపు ఆయన ఆరుగుంటల పాటు విచారించిన సిట్ నారాయణస్వామిని మరోసారి విజయవాడలో విచారిస్తామని తెలిపి నట్లు సమాచారం, అయితే తాజా విచారణ తరువాత ఆయనను అదుపులోకి తీసుకొనే అవకాశం ఉందని కథనం ప్రచారంలోకి వచ్చింది. ఎందుకనో సిట్ ఆయనను వర్చువల్ గానే విచారించింది.

Inquiry – మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై మూడోసారి విచారణ

SIT దర్యాప్తు వేగం – రాజ్ కెసిరెడ్డి ఆస్తుల సీజ్‌కు అనుమతి

ఈ క్రమంలో ఎక్సైజ్ పాలసీలో మార్పుల వెనుక ఉన్నవారి పాత్రపై సిట్ విచారణ చేయనున్న అధికారులు. లిక్కర్ పాలసీ ఆమోదానికి సంబంధించి ఆరాతీయనున్నట్లు సమాచారం. కాగా, లిక్కర్ కేసులో నారాయణ స్వామి పాత్ర కూడా కీలకమని సిట్ అధికారులు భావిస్తున్నారు. లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డికి చెందిన మరిన్ని విలువైన ఆస్తులు, బ్యాంకు ఖాతాలను సీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ కేసులో కెసిరెడ్డి సహా పలువురు నిందితులు, పలు సంస్థలకు చెందిన రూ.62 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు జీవోల ద్వారా ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. మరో రూ.13 కోట్లకు పైగా విలువ చేసే ఆస్తులు, బ్యాంకు ఖాతాలను జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతులు జారీ చేసింది. గత ప్రభుత్వహయాంలో అక్రమ మద్యం అమ్మకాలతో వచ్చిన ముడుపుల ద్వారా పలు చోట్లతన కుటుంబసభ్యులు, బంధువుల పేరిట రూ.కోట్ల విలువ చేసే ఆస్తులు కొనుగోలు చేసినట్టు సీఐడీ విచారణలో తేలింది. వీటిని సీజ్ చేసేందుకు అనుమతించాలని సీఐడీ రాష్ట్రప్రభు త్వాన్ని కోరడంతో అనుమతి మంజూరు చేసింది. కేసిరెడ్డి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/recruitment-from-now-on-dsc-teacher-posts/andhra-pradesh/534787/

Breaking News AP Breaking News in Telugu Former Deputy CM Latest News in Telugu Latest Updates AP Narayanaswamy SIT inquiry Telugu News Paper

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.