Indrakeeladri Temple: ఇంద్రకీలాద్రిపై మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఎపిఐటిసిఓ ఎండి రాజీవ్ మెహ్రా బృందం ఆలయ ఇఓ శీనానాయక్, చైర్మన్ బి. రాధాకృష్ణలతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత నూతన క్యూ లైన్ కాంప్లెక్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ భవనానికి సంబంధించి డిపిఆర్ తయారీపై, అన్నదానం కాంప్లెక్స్, సెల్లార్ స్పేస్ వినియోగంపై బృందం కీలక సూచనలు చేసింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వారి సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ఎపిఐటిసిఓ సేవలను ఆలయ అభివృద్ధికి వినియోగించుకునేలా చేయడంలో ఎంపి కేశినేని చిన్ని కీలక పాత్ర పోషించారని బృందం పేర్కొన్నారు. ఆలయ ఆధ్యాత్మికత దెబ్బతినకుండా, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఆధునిక హంగులతో మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రమాదేవి, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
Read Also: Andhra pradesh: ఐపిఎస్ అధికారి సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు
మహా కుంభాభిషేక పనులను సత్వరమే పూర్తి చేయాలి
మహా కుంభాభిషేక మహోత్సవానికి సంబంధించి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి మరియు జీర్ణోద్ధరణ పనులను నిర్ణీత గడువులోగా, అత్యంత నాణ్యతతో పూర్తి చేయాలని ఆలయ ఆలయ ఇఓ శీనా నాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణలు అధికారులను ఆదేశించారు. సోమవారం ఇఇ శ్రీరామ, డిఇఇ అశోక్ కుమార్తో కలిసి ప్రధాన ఆలయ పైభాగంలోని విమాన గోపురం వద్ద జరుగుతున్న పనులను, ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్, ఇఓ మాట్లాడుతూ భక్తుల సెంటిమెంట్ను దృష్టిలో ఉంచుకుని, మహా కుంభాభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ముఖ్యంగా విమాన గోపురం వద్ద జరుగుతున్న పనుల్లో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని, తుది మెరుగులు దిద్దే పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ప్రధాన ఆలయ శోభ ఉట్టిపడేలా, భక్తులకు కంటికి విందుగా ఉండేలా ఏర్పాట్లు ఉండాలని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.
గ్రహణం కారణంగా మంగళవారం గిరి ప్రదక్షణ రద్దు
ఫాల్గుణ పౌర్ణమి అయిన 3వ తేదీ మంగళవారం మధ్యాహ్నం చంద్ర గ్రహణము సందర్భముగా దేవస్థాన వైదిక కమిటీ వారి సూచనల మేరకు ఆగమ శాస్త్ర ప్రకారము ఉదయం 10గం.ని.లకు శ్రీ అమ్మవారి ప్రధానాలయం, ఇతర ఉపాలయముల కవాట బంధనము చేసి, 4వ తేదీ బుధవారము ఉదయం 3 గంటలకు శ్రీ అమ్మవారి ప్రధానాలయము, ఉప ఆలయముల కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నవనాభిషేకములు నిర్వహించిన అనంతరం అర్చన, మహానివేదన, హారతి నిర్వర్తింప చేసిన తదుపరి ఉదయం 8గంటలకు భక్తులకు దర్శనము కల్పించబడునని ఇఓ వికె శీనా నాయక్ తెలిపారు.
గ్రహణ స్పర్శ కాలము మధ్యాహ్నం 3 గంటల 20ని.లు నుండి గ్రహణ మోక్ష కాలము సాయంత్రం 6.48 వరకు మొత్తం గ్రహణ కాలము 3.28 గం.ని.లు వుంటుందని ఆలయ వైదిక కమిటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ, శాంతి కల్యాణం, చండి హామం, పంచ హారతులు, పల్లకీ సేవలు రద్దు చేశామన్నారు. 4న ఆర్జిత సేవలు రద్దు బుధవారం తెల్లవారుజామున 3 గం.లకు స్నపనాభిషేకములు, అర్చనాది కార్యక్రమములు నిర్వహించు సందర్భముగా తెల్లవారు జామున నిర్వహించు ఆర్జిత సేవలు అయిన ‘సుప్రభాతం, వస్త్రం సేవ, ఖడ్గమాలార్చన, నవగ్రహ శాంతి హోమం, గణపతి హోమము’లను రద్దు చేశామని, ఉదయం 7.30గం. ని.లకు ప్రారంభము అగు ఆర్జిత సేవలను ఉదయం 8.30గం.ని.ల నుండి ప్రారంభించి నిర్వహిస్తారన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: