📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News:Indiramma illu:20 రోజుల్లో పూర్తి – కొత్త టెక్నాలజీతో నిర్మాణం

Author Icon By Pooja
Updated: October 6, 2025 • 11:38 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సరికొత్త సాంకేతికతను వినియోగించి ఓ గ్రామంలో అద్భుతాన్ని సృష్టించారు. ఇటుకలు లేకుండా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తిచేసి ఔరా అనిపించారు. నారాయణపేట(Narayanpet) జిల్లా మద్దూరు మండలంలో ఈ సంఘటన వెలుగు చూసింది. ఇటుకలు లేకుండా కేవలం సిమెంట్, కంకర, స్టీల్తో 20 రోజుల్లోనే ఇళ్లను నిర్మిస్తున్నారు కొందరు.

Read Also: Srisailam Dam:వరద తగ్గుముఖం, 13 గేట్లు ఎత్తి నీటివిడుదల

మిగతా వారు కూడా ఈ పద్దతిని అనుసరిస్తే మంచిది అంటున్నారు. తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో అర్హులైన పేదలందరికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో.. ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభించింది. తొలి విడతలో భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి 3,500 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారు. ప్రస్తుతం అవన్ని నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని చోట్ల ఇంటి నిర్మాణం పూర్తయ్యి.. దసరా పండుగ నాడు గృహ ప్రవేశం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలానే ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం(Government) తక్కువ ధరకే ఇటుక, ఇసుక సరఫరా చేస్తుంది. అలానే ఉపాధి హమీని ఇంటి నిర్మాణ పనులకు అనుసంధానం చేసింది.

ఇదిలా ఉండగా తాజాగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఓ చోట అద్భుతం చోటు చేసుకుంది. ఇటుకలు వాడకుండా… కేవలం 20 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేశారు. కేవలం 20 రోజుల వ్యవధిలో.. ఇటుకలు వాడకుండా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్య పడేలా చేశారు. ఈ సంఘటన నారాయణపేట జిల్లాలో వెలుగు చూసింది.
ఇక్కడ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం సరికొత్త టెక్నాలజీని వాడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గమైన మద్దూరు మండలం.. మొమిన్పూర్లో ప్రయోగాత్మకంగా ఈ పద్దతిని అమలు చేస్తున్నారు. ఈ కొత్త పద్దతిలో 3 ఇళ్లను నిర్మించాలని భావించారు. ముందుగా ఆ మూడు ఇళ్లకు ముగ్గు పోసి.. ఆపై కేవలం స్టీల్, సిమెంట్, కంకర మాత్రమే వినియోగించి గోడలు నిర్మిస్తున్నారు. కాంక్రీట్ మిక్చర్ మెషీన్, ఆర్ఎంసీ అందుబాటులో ఉంటే కేవలం 20 రోజుల్లోనే ఇంటి నిర్మాణం పూర్తవుతుందని అధికా రులు తెలిపారు.

కేవలం 20 రోజుల్లోనే అది కూడా ఇటు కలు లేకుండా ఇంటి నిర్మాణం చేపడుతుండటంపై గ్రామ స్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రాష్ట్రంలోని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడం కోసం ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా రాష్ట్రంలో సుమారు 4.50 లక్షల ఇళ్లు నిర్మించాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకంలో భాగంగా అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి.. దాని నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం కూడా చేస్తారు. అలానే సొంత స్థలం లేని వారికి ముందుగా ఇంటి స్థలం కేటాయించి.. ఆపై ఇల్లు కట్టుకోవడానికి వారికి కూడా రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. అలానే ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అదనంగా రూ.1 లక్ష అంటే మొత్తం రూ.6 లక్షలు ఆర్థిక సహా యం చేస్తారు. ఇంటి నిర్మాణం వివిధ దశల్లో ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Andhra Pradesh Brickless Building Google News in Telugu Indiramma housing Latest News in Telugu New Technology Rapid Construction Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.