విజయవాడ: Indian Railways ఆంధ్రప్రదేశ్లోని(Andhra Pradesh) విజయవాడ–దువ్వాడ సెక్షన్ మీదుగా వెళ్లే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు జరుగుతున్న కారణంగా ఈ నెల 20వ తేదీన (సోమవారం) నాలుగు ఎక్స్ప్రెస్ రైళ్లను(Express trains) రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
Read Also: Vande Bharat: రైల్లో స్నానాకి వేడి నీళ్లు రెడీ
నాన్-ఇంటర్లాకింగ్ పనులు, రద్దయిన రైళ్లు
విజయవాడ-దువ్వాడ సెక్షన్లో ఆటోమేటిక్ సెక్షన్ ప్రారంభం కోసం నాన్-ఇంటర్లాకింగ్ పనులు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. ముఖ్యంగా తుని, హంసవరం, అన్నవరం, రావికంపాడు స్టేషన్ల మధ్య ఈ పనులు జరుగుతున్నాయి.
ఈ నెల 20న రద్దు అయిన రైళ్లు:
- కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం ఎక్స్ప్రెస్ (17267)
- రాజమండ్రి – విశాఖపట్నం ఎక్స్ప్రెస్ (67285)
- విశాఖపట్నం – కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ (17268)
- విశాఖపట్నం – రాజమండ్రి ఎక్స్ప్రెస్ (67286)
ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తమ ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.
రైల్వే సర్వీసులు ఎందుకు రద్దు అయ్యాయి?
విజయవాడ – దువ్వాడ సెక్షన్లో రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు, నాన్-ఇంటర్లాకింగ్ పనులు జరుగుతున్నందున రద్దు అయ్యాయి.
రైళ్లు ఏ సెక్షన్లో రద్దు అయ్యాయి?
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ–దువ్వాడ సెక్షన్ మధ్య రద్దు అయ్యాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: