బొబ్బిలి (విజయనగరం జిల్లా) : భవిష్యత్తులో భారతదేశం(India) అంతరిక్షంలో ప్రపంచ పటాలలో నెంబర్ వన్గా ఎదగడానికి వడివడిగా అడుగులు వేస్తున్నామని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మూడవ లాంచ్ డైరెక్టర్ పి.శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా కళాశాలలో సతీష్ థావన్ స్పేస్ సెంటర్ ఆధ్వర్యంలో అంతరిక్ష వారోత్సవాలు(Space Week celebrations) ముగింపు సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూమికి అతీతంగా జీవించగలిగే మనిషి అంతరిక్షంలో కూడా జీవించడానికి భవిష్యత్తును ఉత్తేజపరిచే కార్యక్రమాలపై మన సైంటిస్టులు పరిశోధనలు జరుపుతున్నారని అన్నారు.
Read Also: TG Govt: బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం

దేశానికి(India) యువశక్తి కృషి ఎంతైనా ఉందని శాస్త్ర పరిశోధనా రంగాలలో మరింత లోతైన అధ్యయనం సాధించే విధంగా విద్యార్థులు ఇప్పటి నుంచే భవిష్యత్ ప్రణాళికలు వేసుకొని అంతరిక్షంలో మనిషి జీవన విధానం పూర్తిస్థాయి అధ్యయనం సాగించిన నాడే ప్రపంచ పటంలో మన దేశం అత్యున్నతంగా నిలబడే రోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక రంగానికి మన వంతు కృషి చేసినప్పుడే అంతరిక్షాన్ని శోధించడం అంత కష్టమేమి కాదని అన్నారు. నాడు ఆకాశం పైకి వెళ్ళడానికి సాహసించాం నేడు దాని వెనుక ఏముందో శోధిస్తున్నామని అన్నారు. మనిషి జీవనానికి ఇక్కడ యోగ్యత ఉందా లేదా అన్న అంశంపై కృషి చేస్తున్నామని అన్నారు. చంద్రయాన్ మంగళయాన్ మిషన్ ద్వారా రెడ్ ప్లానెట్కు చేరి భారత్ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఆదిత్య ఎల్ వన్ సూర్యుడిని పరిశోధించి భూమిని రక్షించడానికి దోహద పడిందన్నారు. ఈ నెలాఖరకు గగనయాన్ ప్రయోగం జరుగుతుందని దానికి ముమ్మర పనులు సాగుతున్నాయని దీనిద్వారా దేశానికి మంచి గుర్తింపు వస్తుందన్నారు. భారతీయ అంతరిక్ష పరిశోధనలు ప్రపంచానికి తెలిసే విధంగా సాగుతున్నాయన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: