📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

IMD Alert: పలు జిల్లాలకు ‘ఫ్లాష్ ఫ్లడ్’ ముప్పు: ఐఎండీ అలర్ట్

Author Icon By Vanipushpa
Updated: August 14, 2025 • 5:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కోస్తా తీరం అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలతో పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో, రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలకు ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) సంభవించే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు యానాం(Yanam)లో ఈ ముప్పు అధికంగా ఉందని స్పష్టం చేయడంతో అధికార యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టింది.

పలు జిల్లాలకు ‘ఫ్లాష్ ఫ్లడ్’ ముప్పు: ఐఎండీ అలర్ట్

కృష్ణా నదికి వరద నీరు భారీగా వరదనీరు

వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం 4 లక్షల క్యూసెక్కులు దాటుతుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నదీ పరివాహక ప్రాంతాలు, లంక గ్రామాల్లో నివసించే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. ఎవరూ వరద నీటిలో ఈతకు వెళ్లవద్దని, చేపల వేట కోసం నదిలోకి ప్రవేశించవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

నాటు పడవలపై ప్రయాణాలు ప్రమాదకరం

నాటు పడవలపై ప్రయాణాలు ప్రమాదకరమని హెచ్చరించారు. ముందుజాగ్రత్త చర్యగా కళింగపట్నం, విశాఖ, కాకినాడ, మచిలీపట్నం పోర్టులలో ప్రమాద సూచికలను ఏర్పాటు చేశారు. ప్రస్తుత అల్పపీడనం శుక్రవారానికి మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ఉత్తరాంధ్ర-ఒడిశా వైపు కదిలే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు కొనసాగవచ్చని ఆయన అంచనా వేశారు. గురువారం నాడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విజయనగరం, నంద్యాల, పల్నాడు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు.

వరద గురించి

సహజంగా మిగులు నీటి ప్రవాహంతో సంబంధం ఉన్న భారీ వర్షాల వల్ల ఆక్రమణలు, ప్రణాళిక లేని అభివృద్ధి మరియు వంటి వాటి వల్ల వరదలు సంభవిస్తాయి. నీటి పరిమాణాన్ని నిర్వహించడానికి సాధారణ సామర్థ్యం కంటే ఎక్కువ వర్షపాతం చారిత్రాత్మకంగా చదునైన స్థాయిలలో నిర్మించిన నగర దృశ్యాలలో వరదలకు దారితీస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/huge-amount-of-marijuana-and-chocolates-seized-through-railways/andhra-pradesh/530080/

Flash Flood flood threat Heavy Rain IMD alert India Meteorological Department Telugu News weather warning

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.