📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Chandrababu : తాట తీస్తా.. ఎవరినీ వదిలిపెట్టను – సీఎం చంద్రబాబు

Author Icon By Sudheer
Updated: May 31, 2025 • 4:30 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి మహమ్మారి నుండి విముక్తి చేయడానికి కఠిన చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో గంజాయి, డ్రగ్స్ (Ganja, drugs) వినియోగం యథేచ్ఛగా పెరిగిందని విమర్శించిన ఆయన, ఇప్పుడు ఇకపై ఎవరైనా గంజాయి లేదా డ్రగ్స్ విక్రయించినా, కొన్నా తాట తీస్తానని, వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. చెయ్యేరు సభలో మాట్లాడిన ఆయన యువత భవిష్యత్‌ను నాశనం చేసే ఈ మాదకద్రవ్యాలకు ఇక చోటు ఉండదన్నారు.

అవినీతి లేని పరిపాలనకు శ్రీకారం

పెన్న్షన్ల వంటి ప్రాథమిక హక్కులకూ లంచాలు తీసుకునే పరిస్థితి దారుణమని పేర్కొన్న చంద్రబాబు, ఇకపై ఎవరైనా అవినీతికి పాల్పడితే, ముఖ్యంగా సంక్షేమ పథకాలలో కఠినంగా శిక్షించబడతారు.. అవినీతి లేని శుభ్రమైన పరిపాలన విధానాన్ని స్థాపించడమే తన ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. ప్రజాసేవకులపై ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.

ప్రజల హక్కుల కోసం కఠిన నిర్ణయాలు

పేదల హక్కులను కాపాడేందుకు, యువతను తప్పుదోవ పట్టకుండా నిరోధించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టంగా చెప్పారు. గంజాయి, డ్రగ్స్ వ్యసనాలను సహించేది లేదని, రాష్ట్రాన్ని ఒక మాదకద్రవ్య రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు. దీనికోసం పోలీసు విభాగాన్ని బలోపేతం చేయడంతో పాటు, అవగాహన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పారు.

Read Also : Goshala : అత్యాధునిక సదుపాయాలతో గోశాలల నిర్మాణం – సీఎం రేవంత్

Chandrababu chandrababu warning ganja drugs Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.