వైఎస్సార్సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ (dwarampudi chandrasekhar reddy) స్పష్టంగా ప్రకటించారు. సినీ పరిశ్రమలో జరుగుతున్న థియేటర్ల బంద్ (Theaters Bandh) వివాదంతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని, కొన్ని మీడియా సంస్థలు ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. “కొంతమంది ఎగ్జిబిటర్లతో కలిసి నేనే థియేటర్లు మూసే ప్రయత్నాలు చేస్తున్నానన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవే. ఇలాంటివి అసత్య ప్రచారమే కాదు, బ్యాధితులపై నిందారోపణలు చేస్తే ఎలా?” అంటూ ప్రశ్నించారు.
తప్పుడు ప్రచారంపై వివరణ
ఎగ్జిబిటర్ నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలను ఆధారాల్లేకుండా ప్రసారం చేసిన కొన్ని మీడియా సంస్థల తీరుపై ద్వారంపూడి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “నట్టి కుమార్ ఏం మాట్లాడారో పరిశీలించకుండా వాటిని నమ్ముతూ ప్రసారం చేయడం సమంజసం కాదు. ఏ వార్తకైనా బాధ్యతతో వ్యవహరించాలి. ఇలా తప్పుడు ప్రచారాన్ని పునరావృతం చేయడం అనైతికం” అని ఆయన స్పష్టం చేశారు.
ఆరోపణలకు ఆధారాలు చూపించండి
తనపై ఎవరికైనా ఏవైనా ఆధారాలు ఉంటే ప్రజల ముందు ఉంచాలని ద్వారంపూడి సవాల్ విసిరారు. “ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేయడం కాదు–ఏదైనా నిజంగా ఉందంటే చూపించండి. న్యాయ వ్యవస్థ ముందు నిలబడటానికి సిద్ధంగా ఉన్నాను” అన్నారు. తనను సినీ పరిశ్రమలోని వివాదాల్లోకి లాగడం సరికాదని, ఆ విషయంలో తాను పూర్తిగా వేరని మరోసారి స్పష్టం చేశారు.
Read Also : Mann Ki Baat : మీ రాకకై ఎదురుచూస్తున్నాం – చంద్రబాబు