శ్రీసత్యసాయి జిల్లా : భగవాన్ సత్యసాయి(Sathya Sai) బాబా ప్రపంచానికి అందించిన శాశ్విత సందేశం “అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు (లవ్ ఆల్-) ను తనతో తీసుకెళుతున్నానని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వ్యాఖ్యానించారు. “వ్యక్తిని లయపరచడం ప్రపంచ శాంతి కోసం మార్గాలు” అనే అంశంపై సత్య సాయి బాబా శతజయంతి మహోత్సవాల సందర్భంగా ప్రశాంతినిలయంలో శ్రీసత్యసాయి ప్రపంచ సదస్సు రెండవ రోజైన శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆధ్యాత్మిక స్పూర్తితో వైదిక మంత్రాలతో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
Read Also: Crimes Tribunal: భుట్టో, హసీన లకు ఒకే పరిస్థితి ఉరిశిక్ష

శ్రీ సత్య సాయి(Sathya Sai) సేవా సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రెండు రోజుల ప్రపంచ సదస్సులో 45 దేశాల నుండి 2500 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ, తన కుటుంబం అనేక దశాబ్దాలుగా స్వామివారి భక్తులు అని, పుట్టపర్తిలో ప్రతి చోటా స్వామి ప్రేమ, దివ్యసాన్నిధ్యం వెలిసిపోతుందన్నారు. ఒడిశా గవర్నర్ ಈ. కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ, భగవాన్ ను మానవతా దీప్తి, నిస్వార్ధ సేవకు ప్రతిరూపం అని వర్ణించారు. బాబా త్రివిధ సేవా యజాలు, శుద్ధజల ప్రాజెక్టులు, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, విలువల ఆధారిత విద్యా వ్యవస్థ, ఇవన్నీ ప్రపంచానికి ఆదర్శ నమూన్నారు.

మిస్ సరీతా అయ్యర్ మాట్లాడుతూ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర వేడుకలుగా ప్రకటించడాన్ని ఆయన అభినందించారు. స్వామి బోధించిన ఏకత్వం, ప్రేమ, సేవనే మనం ఆచరించడం ఆయనకు అత్యుత్తమ నైవేద్యమన్నారు. మిస్ సరీతా అయ్యర్ మాట్లాడుతూ, దైవ మహిమను, దైవ కరుణను నిజంగా గుర్తించిన క్షణమే భక్తి పుడుతుందని ఆమె పేర్కొన్నారు. గజేంద్ర మోక్షం ప్రసంగంలోని అంతర్లీనార్థాన్ని వివరిస్తూ పూర్ణ సమర్పణ, నిర్మలమైన శరణాగతి ఉన్నచోట భగవంతుడు ఎలా వెంటనే ప్రత్యక్షమై రక్షిస్తాడో అద్భుతంగా వివరించారు. శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ డాక్టర్ వీ. మోహన్ సందేశాలలో పుట్టపర్తి మాత్రమే భగవాన్ వారియొక్క జన్మభూమి అని, వారు ఇక్కడి నుంచే అనేక కార్యక్రమాలు చేపట్టడం వల్ల పుట్టపర్తి కర్మభూమి గా కుడా ఎప్పటికీ విలసిల్లుతుందని చెప్పారు.
భగవాన్ వారు సూచించిన సేవా మార్గం లో ప్రతిఒక్కరూ ఈ సందర్భంగా పునరంకితం కావాలని, అదే ప్రతి ఒక్కరూ స్వామి వారికి ఇవ్వగలిగిన పుట్టినరోజు గిఫ్ట్ గా అభివర్ణించారు. శ్రీసత్యసాయి సేవా సంస్థల అఖిలభారత అధ్యక్షులు నిమిష్ పాండ్యా మాట్లాడుతూ, ప్రశాంతినిలయం కు రావడం వల్ల, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు ద్వారా సేవలో పాల్గొనడం వల్ల ప్రతిఒక్కరూ మార్పు చెంది తమ జీవితాల్ని ఉన్నతంగా తీర్చి దిద్దుకోవడానికి దోహద పడుతుందని తెలియచేశారు. మహారాష్ట్ర మాజీముఖ్యమంత్రి, రాజ్యసభసభ్యుడు అశోక్ చవాన్ మాట్లాడుతూ, తానూ ఎన్నో ఏళ్ళుగా తన పదవికి సంబంధం లేకుండా, కేవలం భక్తుడిగా మాత్రమే పుట్టపర్తిని సందర్శిస్తూ వచ్చానని తెలిపారు. ఒకసారి ఆకస్మాత్తుగా వచ్చిన సందర్శన తనలో మరింత వినమ్రతను, భక్తిని పెంచిందని భావోద్వేగంతో గుర్తుచేసుకున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: