Bullet Train : తెలంగాణ రైల్వే నెట్వర్క్ విస్తరణకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి రాష్ట్ర రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. (Bullet Train)హైదరాబాద్ను దేశంలోని ప్రధాన నగరాలతో కలిపేలా మూడు హైస్పీడ్ రైలు మార్గాలు ప్రతిపాదన దశలోకి వచ్చాయి.
హైదరాబాద్–అమరావతి హైస్పీడ్ రైలు – మూడు నగరాలకు బుల్లెట్ రైలు కారిడార్లకు కేంద్రం సుముఖత
హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, అమరావతి నగరాలకు బుల్లెట్ రైలు కారిడార్లను నిర్మించేందుకు కేంద్రం సుముఖత తెలిపింది. ఈ ప్రాజెక్టులు అమలైతే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పారిశ్రామిక–వాణిజ్య రంగాల విస్తరణకు ఊతమిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
- హైదరాబాద్–చెన్నై రూట్: కాజీపేటను దాటకుండా నార్కట్పల్లి, సూర్యాపేట, కోదాడ మీదుగా రైలు మార్గం ఖరారు చేశారు. ఈ మార్గంలో 6–7 స్టేషన్లు ప్రతిపాదించారు.
- హైదరాబాద్–బెంగళూరు రూట్: నాగ్పూర్–హైదరాబాద్–బెంగళూరు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే మార్గంలోనే హైస్పీడ్ రైలు ప్రతిపాదించారు. ఇందులో 3 వేర్వేరు అలైన్మెంట్లు రూపొందించగా, తెలంగాణలో 4–5 స్టేషన్లు ఉండే అవకాశముంది.
- హైదరాబాద్–అమరావతి రూట్: ఈ మార్గానికి సంబంధించి సాధ్యాసాధ్యాల అధ్యయనం, ఖర్చు అంచనాలు తుది దశలో ఉన్నాయి. లక్ష్యం – రాష్ట్ర రాజధానిని తీరప్రాంతంతో వేగవంతమైన కనెక్టివిటీ కల్పించడం.
అదనంగా, రీజనల్ రింగ్ రోడ్ (RRR) పక్కన రీజనల్ రింగ్ రైలు మార్గం ప్రతిపాదన కూడా ఉంది. దీనికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ త్వరలో పూర్తి చేయాలని అధికారులు సూచించారు.
ఇక వికారాబాద్–కృష్ణా, డోర్నకల్–గద్వాల, కల్వకుర్తి–మాచర్ల వంటి కొత్త రైల్వే లైన్లపై కూడా చర్చ జరుగుతుందని సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీటిపై త్వరలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
Read also :