📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

సూపర్-6 పథకాలకు భారీ కేటాయింపులు – సంక్షేమానికి పెద్ద పీట

Author Icon By Sudheer
Updated: February 28, 2025 • 2:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు విపరీతంగా నిధులు కేటాయించింది. ముఖ్యంగా, సూపర్-6 పథకాలను అమలు చేయడానికి పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు రూ.20,000 అందించనున్నారు. విద్యార్థులకు విద్యను ప్రోత్సహించేలా “తల్లికి వందనం” పథకాన్ని ప్రవేశపెట్టారు, దీని కింద 1 నుండి 12వ తరగతుల వరకు చదువుతున్న ప్రతి విద్యార్థి తల్లికి రూ.15,000 నేరుగా జమ చేయనున్నారు. ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులందరికీ వర్తించనుంది. స్కూళ్లు ప్రారంభం అయ్యే నాటికి ఈ నిధులు అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఆరోగ్య బీమా, ఉచిత విద్యుత్ – ప్రజలకు ఊరట

ఆరోగ్య సేవలను మెరుగుపరచడం కోసం ప్రభుత్వం హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల బీమా సదుపాయం అందించేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ఈ పథకం కింద కార్పొరేట్ స్థాయి వైద్యం అందించనున్నారు. అలాగే, ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగించడంతో పాటు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు చేనేత మగ్గాలపై ఆధారపడే కుటుంబాలకు 200 యూనిట్లు, మరమగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కేటాయించారు. నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు కూడా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు.

నివాస నిర్మాణానికి కూడా ప్రభుత్వం విశేష ప్రాధాన్యత ఇచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 7 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేయగా, టిడ్కో ద్వారా 2 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతిచ్చారు. ఎస్సీలకు అదనంగా రూ.50,000, ఎస్టీలకు రూ.75,000 నిధులుగా కేటాయించారు. మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, చేపల వేట నిషేధ కాలంలో వారికి అందించే ఆర్థిక సహాయాన్ని రూ.10,000 నుండి రూ.20,000 కు పెంచారు. దీపం 2.0 పథకం కింద నిధులను కేటాయించడంతో పాటు, ఆదరణ పథకాన్ని పునఃప్రారంభించారు. సంక్షేమాన్ని ప్రాధాన్యమిస్తూ, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో సముచిత కేటాయింపులు చేసింది.

AP Budget ap budget 2025 26 highlights Huge allocations for Super-6 schemes

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.