📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Breaking News – Hostels : పశువులకు కూడా హాస్టల్స్ – సీఎం చంద్ర‌బాబు

Author Icon By Sudheer
Updated: September 20, 2025 • 10:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CBN) మాచర్లలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కొత్త ప్రణాళికలను వెల్లడించారు. పశువుల (Cattle ) సంరక్షణ కోసం ప్రత్యేక హాస్టళ్లు నిర్మిస్తామని ప్రకటించారు. పశువులకు కావాల్సిన షెడ్లు కట్టించి, ఆ హాస్టళ్లకు నేరుగా గడ్డి సరఫరా చేసే విధానం అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులు, పశుపోషకులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టనుందని సీఎం వివరించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు (Chandrbabu) మాచర్ల రాజకీయ పరిస్థితులపై కూడా వ్యాఖ్యలు చేశారు. “ఎక్కడో రాజీవ్ గాంధీ హత్య జరిగినా, మాచర్లలో రౌడీలు విధ్వంసం సృష్టించారు” అని ఆయన గుర్తుచేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగని ప్రాంతంగా మాచర్లను గతంలో చూస్తున్నామని మండిపడ్డారు. ప్రజలకు న్యాయం జరిగేలా ఎన్నికల వ్యవస్థను బలోపేతం చేయడమే తమ కర్తవ్యమని ఆయన తెలిపారు.

అలాగే, గతంలో మాచర్లకు రావాలనుకున్నప్పుడు తనను అడ్డుకునేందుకు ఇంటికి తాళ్లు కట్టారని చంద్రబాబు విమర్శించారు. “నా ఇంటికి తాళ్లు కడితే, మీ మెడలకు ఉరితాళ్లు వేసుకున్నట్లే” అని స్పష్టమైన హెచ్చరిక ఇచ్చినట్లు గుర్తుచేశారు. ప్రజల తీర్పు ఎంత కఠినమో గుర్తుంచుకోవాలని, ప్రవర్తన మార్చుకోకపోతే ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని ఆయన హెచ్చరించారు. అభివృద్ధి, పారదర్శక పాలన ద్వారానే మాచర్లలో శాంతి, శ్రేయస్సు నెలకొంటుందని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

https://vaartha.com/dead-body-in-a-bag/hyderabad/551268/

Chandrababu Google News in Telugu Hostels Hostels for cattle

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.