Himanshu Shukla:రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్య ఆదాయ వనరుగా ఉన్న GST వసూళ్లను పెంచేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో కమర్షియల్ టాక్స్ శాఖతో వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయ సమావేశం నిర్వహించారు. తొలుత జాయింట్ కమిషనర్ (స్టేట్ టాక్స్) వై. కిరణ్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పన్ను వసూళ్ల పురోగతిని వివరించారు.
Read Also: AP: జగన్ తప్పులు చేసి మాపై ఆరోపణలు చేస్తున్నారు: చంద్రబాబు
నమోదు కాని వ్యాపార సంస్థలపై నిఘా
ఈ సందర్భంగా కలెక్టర్(Himanshu Shukla) మాట్లాడుతూ జిల్లాలో నమోదు కాని వ్యాపార సంస్థలను గుర్తించి GST పరిధిలోకి తీసుకురావాలని, పన్ను ఎగవేతను అరికట్టేందుకు శాఖల మధ్య సమాచారాన్ని క్రమం తప్పకుండా పంచుకోవాలని సూచించారు. పన్ను బకాయిల వసూళ్లకు సంబంధించి బకాయిదారుల ఆస్తుల వివరాలను కమర్షియల్ టాక్స్ శాఖకు అందించాలని, పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
GST మరియు TDS నిబంధనల అమలు
కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల సమయంలో GST మరియు TDS నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని, రూ.2.5 లక్షలకు పైబడిన సరఫరా ఒప్పందాలపై GSTR-7 ద్వారా TDS చెల్లింపులు చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు డీజిల్ను స్థానికంగా కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్రానికి పన్ను ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు.గ్రానైట్ తదితర సరుకుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రవాణా మరియు మైనింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పన్ను ఎగవేతదారులపై FIR నమోదు చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు.
వృత్తి పన్ను (Profession Tax) చెల్లింపులు
అంతేకాకుండా రూ.10 లక్షల వార్షిక టర్నోవర్ దాటిన వ్యాపార సంస్థలు, డాక్టర్లు, ఆర్కిటెక్ట్స్ వంటి నిపుణులు ప్రొఫెషన్ టాక్స్ చట్టం కింద పన్ను చెల్లించాలని కలెక్టర్ వివరించారు.ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ (స్టేట్ టాక్స్) వై. కిరణ్ కుమార్, డిప్యూటీ కమిషనర్ ఎం. సత్య ప్రకాష్, ఏఎస్ పి దీక్ష, మున్సిపల్ కమిషనర్ నందన్, జడ్పీ సీఈఓ శ్రీధర్ రెడ్డి, జిల్లా రిజిస్టార్ బాలాంజనేయులు, పరిశ్రమల శాఖ అధికారి శ్రీధర్, డిటిసి చందర్, డిపిఓ వసుమతి, డిఇఓ బాలాజీ రావు, కమర్షియల్ టాక్స్ అధికారులు గోపీచంద్, సోమ సుందర ప్రసాద్, గౌస్ పీర, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: