Chandrababu Naidu : ఇక్కడున్నది 2014 నాటి చంద్రబాబు కాదు…

Read Time:  1 min
Chandrababu Naidu : ఇక్కడున్నది 2014 నాటి చంద్రబాబు కాదు...
Chandrababu Naidu : ఇక్కడున్నది 2014 నాటి చంద్రబాబు కాదు...
FONT SIZE
GET APP

తనపై నిరాధారంగా నిందలు మోపుతున్న రాజకీయ ప్రత్యర్థులపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబాయిని చంపినవాళ్లు నన్నే నిందిస్తున్నారు. శవంపై రాజకీయం చేస్తున్నారు. డ్రామాలా కోడికత్తి, గులకరాయి ఎపిసోడ్‌లా మళ్లీ నమ్మించాలంటున్నారు. కానీ ఇక వీటిని భరించం. ప్రజల మేలు కోరే రాజకీయాలే నా మార్గం. హత్యల ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే వారిని విడిచిపెట్టం అంటూ ఆయన తేల్చిచెప్పారు.శాంతిపురం మండలంలోని తుంసీ వద్ద ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ఇది 2014 నాటి చంద్రబాబు కాదు. ఇది 1995 నాటి సీబీఎన్ (This is CBN from 1995). రౌడీయిజం చేస్తే కఠినంగా ఎదుర్కొంటా. రాక్షసశక్తులపై యుద్ధం చేస్తూనే అభివృద్ధికి, సంక్షేమానికి అంకితమవుతున్నా. ఈ యజ్ఞ ఫలాలను ప్రజలకు అందిస్తా, అని స్పష్టం చేశారు.

కుప్పం అభివృద్ధికి రూ.1292 కోట్లు – భారీ ప్రణాళిక

కుప్పం పర్యటనలో భాగంగా రూ.1292.74 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ.1271 కోట్ల పెట్టుబడులతో కొత్త కంపెనీలు రావడానికి ఒప్పందాలు కుదిరాయి. ఈ ఏడాదిలోనే హంద్రీనీవా నీటిని చివరి ఆయకట్టు వరకు తీసుకెళ్తాం. దీనికోసం రూ.3890 కోట్లతో పనులు వేగవంతం చేశాం, అని తెలిపారు.కుప్పం పేరుతో ఉత్పత్తులకు మార్కెట్ కల్పిస్తామని తెలిపారు. రూ.850 కోట్లతో విమానాశ్రయం, నలుగురుసల రహదారులు నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెల్ ఉంటుంది. ‘పీఎం సూర్యఘర్’ పథకం కుప్పాన్ని మారుస్తుంది, అని పేర్కొన్నారు.

సంక్షేమమే లక్ష్యం – పేదలకే ప్రాధాన్యం

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు. అభివృద్ధి వల్ల వచ్చిన ఆదాయంతో సంక్షేమం చేస్తాం. అదే నిజమైన పాలన, అని అన్నారు. రైతులకు రూ.20 వేలు, పెరిగిన పింఛన్లు, గ్యాస్ కనెక్షన్లు, దీపం–2.0 వంటి పథకాలతో పేదలకు మద్దతిస్తున్నామని చెప్పారు.మీ ఇంటి పెద్ద కుమారుడిలా సేవ చేస్తున్నా. 2029 నాటికి పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతా, అని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ ప్రసాద్, ఎమ్మెల్సీ శ్రీకాంత్, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Read Also : Jagan : మెడికల్‌ కోర్సు విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా : జగన్

Divya Vani M

రచయిత గురించి

Divya Vani M

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.