📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Heavy Rains : తెలుగు రాష్ట్రాల్లో వానలేవానలు

Author Icon By Sudheer
Updated: May 18, 2025 • 9:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తూర్పు దిశగా కదిలి ప్రస్తుతం తమిళనాడు (Tamil Nadu) నుంచి ఆంధ్రప్రదేశ్ (AP) వైపు అడుగులు వేస్తోంది. వాతావరణ శాఖ పేర్కొనిన వివరాల ప్రకారం, ఈ అల్పపీడనం రానున్న రోజుల్లో తుపాను(Thoofan)గా మారే అవకాశముందని అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈ రోజు నుంచే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు (Rains) కురిసే అవకాశం ఉంది. వారం రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.

గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు

వాతావరణ శాఖ సమాచారం ప్రకారం, వర్షాలు కురిసే సమయంలో గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని పేర్కొంది. ప్రజలు భద్రతా చర్యలు తీసుకోవాలని, వర్షం సమయంలో చెట్ల కింద ఉండకూడదని సూచనలు జారీ చేసింది. ఏపీలో విజయనగరం, పార్వతీపురం, ఏలూరు, ప్రకాశం, పల్నాడు, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, తిరుపతి వంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.

తెలంగాణ లోను భారీ వర్షాలు

తెలంగాణలోనూ వర్షాల ముప్పు నెలకొంది. సాయంత్రం 5 గంటల తర్వాత పశ్చిమ తెలంగాణలో వర్షం మొదలై రాత్రంతా కురిసే అవకాశం ఉంది. గద్వాల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, బెల్లంపల్లి, జగిత్యాల వంటి ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి లేకుండా మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతాయని హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Read Also : India – Pakistan War : కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

Google News in Telugu Rains telugu states

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.