📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Heavy Rains in AP : ఆ నాలుగు జిల్లాల్లో హై అలెర్ట్ .. బయటకు రావద్దు.. ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక!

Author Icon By Divya Vani M
Updated: October 16, 2024 • 7:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ కోస్తా రాష్ట్రానికి తీవ్ర వర్షాలను తేవడం మొదలు పెట్టింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుండటంతో, రాష్ట్రంపై భారీ ప్రభావం పడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ప్రత్యేకంగా, దక్షిణ కోస్తా జిల్లాలకు తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉండడంతో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించడంతో, రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

వాయుగుండం కారణంగా ఏపీలోని నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసారు, ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు మరియు కడప జిల్లాలకు మెరుపు వరదలు వచ్చే అవకాశం ఉంది. నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలలో మత్స్యకారులకు వేటకు వెళ్లకుండా అధికారులు ఆదేశించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం సాయంత్రానికి వాయుగుండంగా మారింది. ఇది బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా వైపు కదులుతోంది. రేపు పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో, ఆ నాలుగు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఫలితంగా, మెరుపు వరదలు సంభవించవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ముంపు పెరగడం ఖాయం. విజయవాడ అనుభవాలను బట్టి అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.

వాయుగుండం ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుండ పోత వర్షం పడుతూనే ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. కావలిలో అత్యధికంగా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కిందస్థాయి సిబ్బంది ఎవరు సెలవులు పెట్టొద్దని, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఈ సమయంలో, స్థానిక ప్రజలు సురక్షితంగా ఉండటానికి మరియు అధికారులు అందించిన హెచ్చరికలను పాటించడానికి సిఫారసు చేయబడుతున్నారు. సమీపంలో జరిగే వర్షాలు మరియు అకాల వరదల ప్రభావాలను అధిగమించడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి.

AndhraPradesh APWeather FlashFloods HeavyRains HighAlert NaturalDisasters RainAlert SafetyFirst StaySafe WeatherWarnings

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.