Heavy Rain Warning: నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం మరింత బలపడుతూ వాయవ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు తీసుకొచ్చింది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఈ వాయుగుండం శనివారం మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు శ్రీలంకలోని ట్రింకోమలి-జాఫ్నా తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీరం దాటిన తర్వాత ఇది బలహీనపడి సాధారణ వాయుగుండంగా మారవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also: Telugu States: పెరుగుతున్న చలి.. వణుకుతున్న జనం
తీవ్ర వాయుగుండం ప్రభావంతో తమిళనాడు(Tamil Nadu)లోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rain Warning) కురిసే అవకాశం ఉంది. తిరువారూర్, నాగపట్నం, మయిలాడుతురై, కడలూరు జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్’ అలర్ట్ జారీ చేసింది. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, విల్లుపురం సహా 10 జిల్లాలకు ‘ఎల్లో’ అలర్ట్ జారీ చేసి, గంటకు 35–45 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్లో(AP) దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. చలి తీవ్రత పెరుగుతుండటంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పడిపోవచ్చని అధికారులు తెలిపారు. తెలంగాణలో వర్షం ఉండకపోయినా పొడి వాతావరణం, పొగమంచు గాలులు కొనసాగుతున్నాయి.
సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. వాతావరణ నిపుణుల ప్రకారం, జనవరిలో ఇలాంటి తీవ్ర వాయుగుండాలు రావడం అరుదు. ప్రజలు IMD జారీ చేసే హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: