📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Latest News: Health Scheme: పేద కుటుంబాలకురూ.25లక్షల ఉచిత వైద్యం

Author Icon By Saritha
Updated: December 6, 2025 • 12:12 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : పేద, ధనిక తేడా లేకుండా అందరికీ ఉచిత ఆరోగ్య భీమా(Health Scheme) అందుబాటులోకి వచ్చేలా రూపొందించిన ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ సమర్థ అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవ-ఏబీ పీఎంజెఏవై పథకం హైబ్రిడ్ మోడ్లో అమలుకు పిలిచిన టెండరులో ఆర్ఎఫ్పీ, డీసీఏలో కొన్ని సవరణలకు ఆమోదం తెలి పింది. ప్రీబిడ్ సమావేశాల ద్వారా చిన్న చిన్న సవరణలకు టెండరు కమిటీకి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఆయా ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ మేరకు వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏటా రూ.5 లక్షల వరకు ఆదా యం ఉన్న పేద వర్గాలకు (బీపీఎల్) చెందిన కుటుంబాలకు రూ.2.50 లక్షల వరకు ఇన్సూరెన్స్ మోడ్లో అంతకంటే ఎక్కువ అవసరమైతే రూ.25 లక్షల వరకు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య సేవలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Read also: ఇండిగో విమాన సిబ్బందికి మ‌ద్ద‌తుగా సోనూ సూద్

Free medical treatment worth Rs. 25 lakhs for poor families

ఏపీలో యూనివర్సల్ హెల్త్ పాలసీ

ఏపీఎల్ కుటుంబాలు (ఈహెచ్ఎస్, వర్కింగ్ జర్నలిస్టు స్కీం మినహా) రూ.2.50 లక్షల వరకు భీమా వర్తిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు భీమా కంపెనీలకు(Health Scheme) సెప్టెంబరు 9న ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. టెండరు నిబంధనల్లో మార్పులతో తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంంలో ఈహెచ్ ఎస్, వర్కింగ్ జర్నలిస్ట్ స్కీం మినహా మిగిలిన అన్ని కుటుంబాలు యూనివర్సల్ హెల్త్ పాలసీ పరిధి లోకి వస్తాయి. పీఎం జేవై, ఎన్టీఆర్ వైద్యసేవ లబ్దిదారుల కుటుం బాల్లోని సభ్యులు ఈ పథకం పొందడానికి అర్హులు. ఏడాది పొడవునా అస్పత్రుల నమోదుకు ధరఖాస్తులు స్వీకరిస్తారు. ఏడాదికి రెండుసార్లు జాబితాలో నమోదు ప్రక్రియ జరు గుతుంది. భీమా కంపెనీలు పన్నులు మినహా యించి ప్రీమియం ధర చెల్లించవచ్చు క్లైయిమ్ రేషియో 120 శాతం దాటితే ప్రీమియం మించిన అదనపు ఖర్చులో 50 శాతం ట్రస్ట్ 50 శాతం భీమా కంపెనీ భరిస్తాయి. ప్రభుత్వ ఆస్పత్రులకు(Hospitals) ప్రత్యేకంగా కేటాయించిన 521 వ్యాధులకు సంబంధించిన సేవలకు మొదట భీమా కంపెనీ భరిస్తుంది. బిల్లులు పరిశీలించి ట్రస్ట్ సొమ్ము చెల్లిస్తుంది. రాష్ట్ర జిల్లా, ఆస్పత్రుల స్థాయిలో ప్రస్తుతం సేవలందిస్తున్న వైద్య మిత్రులు, ట్రస్ట్లో పనిచేస్తున్న పొరుగు సేవల ఒప్పంద సిబ్బందిని అవసరాల మేరకు భీమా కంపెనీ కొనసాగించాల్సి ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

AB PMJAY Andhra Pradesh Health Scheme AP Government APL Families BPL Families Free Medical Treatment health insurance Latest News in Telugu ntr vaidya seva Universal Health Policy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.