ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని(Health Scheme) పూర్తిగా ఆధునికీకరించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్(Chandrababu-Bill gates) కలిసి కీలక డిజిటల్ హెల్త్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.
Read Also:AP: ఏపీకి వస్తున్న బిల్ గేట్స్..చంద్రబాబుతో భేటీ
ఈ ప్రాజెక్టు కింద ప్రతి పౌరుడికి ప్రత్యేకమైన డిజిటల్ హెల్త్ కార్డు జారీ చేయనున్నారు. దీని ద్వారా వారి వైద్య చరిత్ర, పరీక్షల వివరాలు, చికిత్స సమాచారం వంటి డేటాను డిజిటల్ రూపంలో భద్రపరచనున్నారు. దీంతో ఆసుపత్రులకు వెళ్లినప్పుడు వైద్యులు రికార్డులను సులభంగా చూసి తక్షణమే సరైన చికిత్స అందించే అవకాశం ఉంటుంది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత ఆరోగ్య పరీక్షలు, ప్రాథమిక వైద్య సేవలు, మాతా–శిశు సంరక్షణ కార్యక్రమాలు కూడా ఈ ప్రాజెక్టు(Health Scheme) ద్వారా అందించనున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలకు సంబంధించిన ఆరోగ్య సేవలను మరింత మెరుగుపర్చడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అదే విధంగా ప్రతి కుటుంబానికి రూ.2.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కవరేజీ కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలు భారీ వైద్య ఖర్చుల భారంనుంచి విముక్తి పొందే అవకాశం ఉంది.
ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా(Chandrababu-Bill gates) అమలు చేస్తున్న ఈ డిజిటల్ హెల్త్ మిషన్ను త్వరలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి గేట్స్ ఫౌండేషన్తో పాటు ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భాగస్వాములుగా సహకరిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుతో ఏపీ ఆరోగ్య రంగంలో డిజిటల్ విప్లవం ప్రారంభమైందని, దేశానికే ఒక మోడల్గా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: