📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

తమ్ముడి ఆరోగ్య పరిస్థితి విషమం.. సీఎం చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు

Author Icon By sumalatha chinthakayala
Updated: November 16, 2024 • 11:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్నారు. అయితే, ఈరోజు ఉదయం చిన్నాన్న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంత్రి నారా లోకేశ్ హుటాహుటీన హైదరాబాద్ కు బయలుదేరారు. ఈ క్రమంలో ఈరోజు తన అన్ని కార్యక్రమాలను లోకేశ్ రద్దు చేసుకొని హైదరాబాద్ చేరుకున్నారు. రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే, తమ్ముడి ఆరోగ్యం విషమంగా ఉండటంతో చంద్రబాబు కూడా తన మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు.

కాగా, సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ న్యూఢిల్లీలోని తాజ్ ప్లాలెస్ లో జరిగే మీడియా కాన్‌క్లేవ్ లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2గంటలకు ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు చంద్రబాబు నాయుడు వెళ్లాల్సి ఉంది. సాయంత్రం 5.30 గంటలకు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా థానేలో జరిగే ప్రచార సభలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. అయితే, తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మహారాష్ట్ర పర్యటనను చంద్రబాబు రద్దు చేసుకున్నారు. మధ్యాహ్నం ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ కు చంద్రబాబు చేరుకోనున్నారు. ఇప్పటికే తన సోదరుడు రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితిపై వివరాలను కుటుంబ సభ్యులు, ఆస్పత్రి వైద్యులతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడి తెలుసుకున్నట్లు సమాచారం.

CM chandrababu Maharashtra Minister Nara Lokesh Rammurthy Naidu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.