हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

పోలవరం ఆలస్యానికి కారణం అతడే – మంత్రి నిమ్మల

Sudheer
పోలవరం ఆలస్యానికి కారణం అతడే – మంత్రి నిమ్మల

పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగనేనని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. గోదావరి, కృష్ణా జలాలపై మాట్లాడే నైతిక హక్కు కూడా జగన్‌కు లేదని తీవ్ర విమర్శలు చేశారు. తన వ్యక్తిగత కేసులు, బెయిల్ విషయంలో చర్చల కారణంగా జగన్‌ జలాలపై హక్కులను వదులుకున్నారని ఆరోపించారు.

రైతులకు నష్టం కలిగించిన వ్యక్తిగా జగన్‌ను ప్రజలు, రైతులు క్షమించరని మంత్రి నిమ్మల అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్‌ తీరును తప్పుబడుతూ, ప్రాజెక్టు ఎత్తును రెండు దశల్లో తగ్గించడమే రైతులకు జరిగిన అన్యాయం అని ఆయన పేర్కొన్నారు. ఈ చర్య వల్ల సాగునీటి అవసరాలు తీరడం కష్టమైందని తెలిపారు. ప్రాజెక్టు ఆలస్యం కారణంగా రాష్ట్రానికి భారీగా నష్టమవుతుందని, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆలస్యమవడానికి జగన్‌ పాలనలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమని మంత్రి అన్నారు. పోలవరం ఎత్తు తగ్గించడమే కాకుండా, ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగడంలో గందరగోళం సృష్టించారన్నారు. గోదావరి, కృష్ణా జలాలపై జగన్‌ తీసుకున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్‌కు వ్యతిరేకంగా మారాయని మంత్రి నిమ్మల విమర్శించారు. ప్రజల హక్కులను కాపాడే స్థాయిలో నాయకత్వం చూపడంలో జగన్ విఫలమయ్యారని, ఆయన పాలనలో జరిగిన నష్టాలను పూడ్చేందుకు ప్రస్తుత ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ఈ ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా తీసుకున్నదని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేసి, తక్షణం పూర్తిచేసేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870