కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారాం అహిర్ (Hansraj Gangaram Ahir)
విజయవాడ : వెనుకబడిన తరగతుల అభ్యున్నతే లక్ష్యంగా అధికారులు పని చేయాలని జాతీయ వెనుబడిన తరగతుల కమిషన్ చైర్మన్ హన్సరాజ్ గంగారాం అహిర్ (Hansraj Gangaram Ahir) అన్నారు. ఒబిసి రిజర్వేషన్లు, రోస్టర్, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిసిలకు చట్ట ప్రకారం కల్పించిన రిజర్వేషన్లను అమలు అలసత్వం తగదన్నారు. సీపెట్ సంస్థ కార్యకలాపాలు, ప్లాస్టిక్ కోర్సుల్లో ఇస్తున్న శిక్షణ, తదితర అంశాలను సీపెట్ డైరెక్టర్ శేఖర్ కమిషన్ (Shekhar Commission) చైర్మన్కు వివరించారు. యూనియన్ బ్యాంక్ లో అమలవుతున్న ఒబిసి రిజర్వేషన్లు, బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీ తదితర విషయాలను బ్యాంక్ అధికారులను అడిగి తెలుసు కున్నారు. మంగళగిరిలోని ఎయి మ్స్ అందిస్తున్న సేవలు, పోస్టుల భర్తీ, అమలు చేస్తున్న రోస్టర్ విధానం తదితర వివరాలను సిఇఒ శాంతా సింగ్ చైర్మన్కు తెలియజేశారు. రాష్ట్రంలో 18 వైద్య కళాశాలలు ఉన్నాయని, వైద్య విద్యా సీట్ల కేటాయింపులో ఒబిసి రిజర్వేషన్ల (Reservations) వివరాలను, రోస్టర్ విధానం తదితర అంశాలను చైర్మన్కు వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అంతకు ముందు చైర్మన్కు స్వాగతం పలికారు. అధికారులు క్రమశిక్షణ, నిబద్ధతతో వెనుకబడిన తరగతుల అభ్యున్నతి లక్ష్యంగా పనిచేయాల్సి ఉంది.
హన్స్రాజ్ అహిర్ స్థానం ఏమిటి?
హన్స్రాజ్ అహిర్ ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు ప్రస్తుత జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్.
హన్స్రాజ్ ప్రైవేట్ లేదా ప్రభుత్వమా?
హన్స్రాజ్ కళాశాల అనేది ఢిల్లీ విశ్వవిద్యాలయంతో అనుబంధంగా ఉన్న ప్రభుత్వ కళాశాల. ఇది ప్రైవేట్ సంస్థ కాదు. ఇది ప్రభుత్వ కేంద్ర విశ్వవిద్యాలయం అయిన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఒక రాజ్యాంగ కళాశాల. ఈ కళాశాలను ప్రభుత్వేతర సంస్థ అయిన DAV మేనేజింగ్ కమిటీ నిర్వహిస్తుంది, కానీ కళాశాల కూడా ప్రభుత్వ నిధులతో నడిచే విశ్వవిద్యాలయ వ్యవస్థలో భాగం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Ghazal Srinivas: తెలుగు భాషా విధానంపై అంతర్జాతీయ లఘు చలన చిత్ర పోటీలు