📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

News Telugu: Guntur Crime: గుంటూరు ను వణికించిన మైనర్లు… ఏం చేసారో తెలుసా?

Author Icon By Rajitha
Updated: December 1, 2025 • 3:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుంటూరు (Guntur) జిల్లా సత్తెనపల్లిలో జరిగిన ద్విహత్య ఘటన స్థానికులను కలవరపరిచింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మైనర్లు కలిసి దాడికి పాల్పడ్డారు. ధూళిపాళ్లకు చెందిన సాంబశివరావు, గణపవరానికి చెందిన సాహితి ఇద్దరూ రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. సంతానం లేకపోవడం, కలహాలు పెరగడం వంటి కారణాలతో ఆరు నెలల క్రితం వీరిద్దరూ విడిపోయారు. తర్వాత సాహితి మరో పెళ్లి చేసుకుంది. అయితే విడాకుల అనంతరం కూడా సాంబశివరావు ఆమెపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే విషయం సాహితికి తెలిసి బాధపడుతూ ఉండేది. ఈ పరిస్థితిని చూసిన సాహితి తమ్ముడు రోహిత్ ఆవేశంతో సాంబశివరావును హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా విచారించి తెలిపారు.

Read also: AP: నిందితులను కఠినంగా శిక్షించండి..మంత్రి అనిత

Guntur Crime

సాంబశివరావుపై దాడి

ఆదివారం సాంబశివరావు ఇంట్లో ఉన్నాడని తెలిసిన రోహిత్, తన ఇద్దరు మైనర్ స్నేహితులు రవికుమార్‌, జావెద్‌లతో కలిసి బైక్‌పై ధూళిపాళ్లకు వెళ్లాడు. స్నేహితులు బయట వేచి ఉండగా రోహిత్ ఇంట్లోకి వెళ్లి కత్తితో సాంబశివరావుపై దాడి చేశాడు. అతన్ని అడ్డుకునేందుకు వచ్చిన సాంబశివరావు తల్లి కృష్ణకుమారిని కూడా అతను గాయపరిచాడు. ఈ దాడిలో సాంబశివరావు అక్కడికక్కడే మరణించగా, గాయాలతో చికిత్స పొందుతున్న కృష్ణకుమారి అనంతరం ప్రాణాలు కోల్పోయింది. ఘటనా స్థలం వద్ద కేకలు వినిపించడంతో స్థానికులు పరుగెత్తి వచ్చారు. పారిపోతున్న ముగ్గురిని ఐదు కిలోమీటర్ల దూరంలో పట్టుకొని పోలీసులకు అప్పగించారు. చికెన్ షాప్‌ నుంచి కత్తిని దొంగిలించి దాడి చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. మొత్తం ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

ap-news guntur-crime latest news minors-murder Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.