हिन्दी | Epaper
ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట

News Telugu: Guntur Crime: గుంటూరు ను వణికించిన మైనర్లు… ఏం చేసారో తెలుసా?

Rajitha
News Telugu: Guntur Crime: గుంటూరు ను వణికించిన మైనర్లు… ఏం చేసారో తెలుసా?

గుంటూరు (Guntur) జిల్లా సత్తెనపల్లిలో జరిగిన ద్విహత్య ఘటన స్థానికులను కలవరపరిచింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మైనర్లు కలిసి దాడికి పాల్పడ్డారు. ధూళిపాళ్లకు చెందిన సాంబశివరావు, గణపవరానికి చెందిన సాహితి ఇద్దరూ రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. సంతానం లేకపోవడం, కలహాలు పెరగడం వంటి కారణాలతో ఆరు నెలల క్రితం వీరిద్దరూ విడిపోయారు. తర్వాత సాహితి మరో పెళ్లి చేసుకుంది. అయితే విడాకుల అనంతరం కూడా సాంబశివరావు ఆమెపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే విషయం సాహితికి తెలిసి బాధపడుతూ ఉండేది. ఈ పరిస్థితిని చూసిన సాహితి తమ్ముడు రోహిత్ ఆవేశంతో సాంబశివరావును హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా విచారించి తెలిపారు.

Read also: AP: నిందితులను కఠినంగా శిక్షించండి..మంత్రి అనిత

Guntur Crime

Guntur Crime

సాంబశివరావుపై దాడి

ఆదివారం సాంబశివరావు ఇంట్లో ఉన్నాడని తెలిసిన రోహిత్, తన ఇద్దరు మైనర్ స్నేహితులు రవికుమార్‌, జావెద్‌లతో కలిసి బైక్‌పై ధూళిపాళ్లకు వెళ్లాడు. స్నేహితులు బయట వేచి ఉండగా రోహిత్ ఇంట్లోకి వెళ్లి కత్తితో సాంబశివరావుపై దాడి చేశాడు. అతన్ని అడ్డుకునేందుకు వచ్చిన సాంబశివరావు తల్లి కృష్ణకుమారిని కూడా అతను గాయపరిచాడు. ఈ దాడిలో సాంబశివరావు అక్కడికక్కడే మరణించగా, గాయాలతో చికిత్స పొందుతున్న కృష్ణకుమారి అనంతరం ప్రాణాలు కోల్పోయింది. ఘటనా స్థలం వద్ద కేకలు వినిపించడంతో స్థానికులు పరుగెత్తి వచ్చారు. పారిపోతున్న ముగ్గురిని ఐదు కిలోమీటర్ల దూరంలో పట్టుకొని పోలీసులకు అప్పగించారు. చికెన్ షాప్‌ నుంచి కత్తిని దొంగిలించి దాడి చేసినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. మొత్తం ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870