గుంతకల్లు రైల్వే(Guntakal Railway) దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు, గుంటూరు డివిజన్ లలో తిరుగుతున్న ఎక్స్ ప్రెస్ రైలు సర్వీ సులను రాయలసీమ ప్రజల/ప్రయాణీకుల సౌక ర్యార్థం గుంతకల్లుగుంటూరు/విజయవాడ మధ్య నడపాలని రైల్వే వినియోగదారులు కోరుతు న్నారు. ప్రస్తుతం గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని డోన్ నుంచి గుంటూరు వెళ్ళే నెంబర్ 17227 ఎక్స్ ప్రెస్ రైలు ప్రతిరోజు ఉదయం 06:30 గంటలకు డోన్ నుండి బయలు దేరి మధ్యాహ్నం 02:00 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మరుసటి రోజు గుంటూరు నుంచి డోన్ కు బయలుదేరే నెంబర్ 17228 ఎక్స్ ప్రెస్ రైలు సర్వీసు ప్రతి రోజు మధ్యాహ్నం 01:00 గంటలకు గుంటూరు నుంచి బయలుదేరి రాత్రి 08:45 గంటలకు డోన్ చేరుకుంటుంది.
Suresh Gopi: నా ఆదాయం ఆగిపోయింది.. మళ్ళీ సినిమాల్లో నటిస్తా: మంత్రి సురేశ్
ఈరైలు ఫార్మేషన్ రేక్ రాత్రి 08:45 నుంచి తరువాతి రోజు ఉదయం 06:30 గంటల వరకు దాదాపు పదిగంటల పాటు డోన్ లో వృధాగా ఉంచడం కంటే, డోన్ నుండి కేవలం 68 కిలోమీటర్ల దూరంలోని గుంతకల్లు వరకు పొడిగిస్తే ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లావాసులు తమ తమ అవసరాల నిమిత్తం రాష్ట్ర రాజధాని అమ రావతికి వెళ్ళి వచ్చేందుకు సౌకర్యంగా, అనుకూలంగా ఉంటుందని పలువురు పేర్కొం టున్నారు. గుంతకల్లుగుంటూరు/విజయవాడ మధ్య కొత్తగా రైలు(Guntakal Railway) ప్రవేశ పెట్టాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈనేపథ్యంలో ప్రజల సౌకర్యార్థం 17228/27 రైలు సర్వీసులను గుంతకల్లు గుంటూరు విజయవాడ లేదా గుంతకల్లుగుంటూరు మధ్య నడిపితే రైల్వేకు రెవెన్యూ(Revenue for Railways) రాబడి పెరుగడంతోపాటు ప్రయాణీ కులకు ఉపయోగకరంగాను ఉంటుందని రైల్వే ప్రయాణీకులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: