📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

తల్లికి వందనంపై త్వరలోనే గైడ్ లైన్స్ : మంత్రి లోకేష్

Author Icon By sumalatha chinthakayala
Updated: March 4, 2025 • 12:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతి: కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలుచేయనుందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తల్లికి వందనం అమలుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరలోనే ప్రకటిస్తామని శాసన మండలిలో లోకేష్ వెల్లడించారు. తల్లికి వందనం పథకం పై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. తల్లికి వందనం పథకానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.

వైసీపీ హయాంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ రాదు

ఏపీలో బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ బదులిచ్చారు. తల్లికి వందనం సహా అన్ని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామన్న నారా లోకేష్.. నిరుద్యోగ భృతిపై సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. నిరుద్యోగులకు జాబ్స్ ఇవ్వడంపై గత వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదని నారా లోకేష్ పేర్కొన్నారు.

ఏపీలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టులు భర్తీ

సామాజిక పింఛన్లు వెయ్యి రూపాయలు పెంచిన కూటమి ప్రభుత్వం త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. ఏపీలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఏపీ అసెంబ్లీ సమావేశాలలో మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. తాజాగా తల్లికి వందనంపై సైతం మార్గదర్శకాలు రూపొందిస్తోంది. సూపర్ సిక్స్‌ పథకాలు ప్రకటించి ఏపీ ఎన్నికల్లో నెగ్గి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. వైసీపీ హయాంలో అమ్మ ఒడి పేరుతో మొదలుపెట్టిన పథకానికి కూటమి మార్పులు చేర్పులు చేపట్టింది. ఎన్నికల మేనిఫెస్టోలనే తల్లికి వందనం పేరుతో అమలు చేస్తామని.. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో ఒక్కో విద్యార్థికి ఏడాదికి 15 వేలు జమ చేస్తామని చెప్పారు.

Breaking News in Telugu Google news Google News in Telugu guidelines Latest News in Telugu Minister Lokesh Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.