కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0(GST 2.0) సంస్కరణల తర్వాత కొన్ని వస్తువులపై పన్నులు తగ్గాయి. ఇది పేద, మధ్యతరగతి వినియోగదారులకు ఊరట అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం(income)పై ప్రతికూల ప్రభావం చూపింది.
తెలంగాణ పరిస్థితి
తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు నవంబరులో గతేడాదితో పోలిస్తే 2 శాతం పెరిగినప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో 131 కోట్ల రూపాయల (4.6%) తగ్గుదల నమోదైంది. ఇది ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, సిమెంట్, డెయిరీ ఉత్పత్తుల పన్నుల తగ్గింపు, పెట్రోలియం ఆదాయం తగ్గడం, మరియు మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా కలిగింది.
Read Also: Pensions: ఎన్టీఆర్ భరోసా పింఛన్లపై దుష్ప్రచారం – AP ఫ్యాక్ట్ చెక్ టీమ్ స్పష్టం
ముఖ్యమైన తగ్గింపులు
సంస్కరణల్లో హెయిర్ ఆయిల్, షాంపూ, షేవింగ్ క్రీమ్, టూత్ బ్రష్, టాయిలెట్ సబ్బులు వంటి వస్తువుల ధరలు తగ్గాయి. ఎలక్ట్రానిక్ పరికరాలు – AC, TV, వాషింగ్ మెషీన్లు, డిష్ వాషర్స్ –పై కూడా జీఎస్టీ తగ్గింపు ఉంది. సిమెంట్ జీఎస్టీ 28% నుండి 18%కి, ఆటోమొబైల్స్పై సెస్ తొలగించి 40% ఫ్లాట్ రేట్, చిన్న కార్లపై 18%కి తగ్గింపులు చేయబడ్డాయి.
అక్టోబర్లో రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం మంచి పెరుగుదల (5.8%) చూపినప్పటికీ, నవంబరులో పన్ను తగ్గింప్ల ప్రభావం మరియు తుఫాన్ వల్ల ఆదాయం తగ్గింది. ఈ మార్పులు వస్తు సేవల కొనుగోళ్లు పెరుగుతుండగా, మొత్తం ఆదాయం మీద ప్రతికూల ప్రభావం చూపాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: